ఆసిఫాబాద్ లో మావోయిస్టులు.. డిజీపీ ప్రెస్ మీట్‌పై ఉత్కంఠ..

మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ లో కొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వారిలో ఎవరైనా నాయకులు ఉన్నారా? తెలంగాణ కేడర్ ఉన్నారా? మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్లేనా? వంటి విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే, ఆ సస్పెన్స్ ఈరోజు వీడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు హైద్రాబాద్ లోని డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టులో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు పోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల లొంగుబాటును లేదంటే అరెస్ట్ ను చూపించడానికే ఈ సమావేశం…

Read More

సోనూ, ఆశన్న చేసిన తప్పులివే.. ఆయుధాలు వదిలేయడం చరిత్రలో కొత్త కాదా?

మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన సోనూ, ఆశన్న తదితరులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియస్ చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా వాళ్లు మూకుమ్మడిగా ఆయుధాలు వదిలేసి, పోలీసుల ఎదుట లొంగిపోవడాన్ని నెటిజన్లు, మేధావుల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే వారిని ద్రోహులుగానే అభివర్ణిస్తున్నారు. ఇలాంటి మేధావులపై ఇటీవల సోనూ, ఆశన్న తదితరులు తీవ్రంగా విరుచుకు పడుతూ మాజీ మావోయిస్టుల పేరుతో పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో చరిత్రకు, రాజకీయాలకు సంబంధించిన కొన్ని వివరాలు…

Read More

టాక్టికల్ రిట్రీటే ఏకైక మార్గం.. చిన్న టీంలుగా తిరగాలంటూ మావోయిస్టు పార్టీ సర్క్యులర్..

ఆయుధాలు వదిలేద్దామని, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టమని మావోయిస్టు పార్టీలో గత రెండేళ్ల నుంచే అంతర్గత చర్చ జరుగుతున్నట్లుగా నిన్న కొన్ని దిన పత్రికలు, టీవీ చానెళ్లు వార్తలు పబ్లిష్ చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర రాష్ట్రాల కమిటీలు ఈ అభిప్రాయంతో ఉన్నాయని 2024 ఆగస్టులో వెలువడిన పొలిట్ బ్యూరో సర్క్యులర్ లో అలా ఉన్నట్టు రాశాయి. అంటే సోనూ అలియాస్ మల్లోజుల వేణు లేఖ బయటకు రాకముందే ఇలాంటి చర్చ ఆ…

Read More

నక్సలైట్ నేతగా నేషనల్ మీడియాతో నా ఇంటర్వ్యూ..

జర్నలిజంలోకి ప్రవేశించక ముందు నేను విప్లవోద్యమంలో పనిచేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణ, కర్నాటక, దండకారణ్య(డీకే) ప్రాంతాల్లో వివిధ రంగాల్లో 17 ఏళ్లు పనిచేసి కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా బయటకు వచ్చాను. జర్నలిజంలో పీజీ చేసి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాను. ప్రస్తుతం దిశ దినపత్రిక ఎడిటర్‌గా ఉన్నాను. 1998లో నేను డీకేలో ఉన్నప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పార్టీ తరఫున నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాను….

Read More
Marokonam

తాజా వార్తలు.. ఎప్పటికప్పుడు.. (పగలు 2.30 గం. సోమవారం, 31 డిసెంబర్ 2024)

TG High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా.. 4 గంటలకల్లా తేలిపోనున్న కేటీఆర్ ఫ్యూచర్ INTER STUDENTS: ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి ఉచిత భోజనం NEW YEAR ALERT: కొత్త సంవత్సరం వేడుకలను..ఇంట్లోనే జరుకోండి : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ CM CHANDRABABU: గత ప్రభుత్వ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు: ఏపీ సీఎం చంద్రబాబు నాకు హైకమాండ్ ఎవరు లేరు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు పేదరికం…

Read More

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీలుగా షిండే, పవార్

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ నిర్ణయించింది. ఆయనకు డిప్యూటీలుగా ఏకనాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఉంటారు. ఈ మేరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ బుధవారం జరిగిన సమావేశంలో ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారం రేపు (గురువారం) జరుగుతుంది.

Read More

తెలంగాణ(Telangana)లో మరోసారి (earthquake) భూకంపం? : NGRI ఏం చెప్తున్నది?

మరోకోణం డెస్క్: బుధవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం తెలంగాణను వణికించింది. ఏమైందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం ములుగు కేంద్రంగా సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపాయి. ఈ భూప్రకంపనలపై NGRI శాస్త్రవేత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూప్రకంపనలు వచ్చేందుకు…

Read More

‘అంతరంగ’ మథనం – అన్నవరం దేవేందర్ పుస్తక సమీక్ష

సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా, నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి. ఒక ఆర్టికల్‌కి మరొక ఆర్టికల్‌కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండును ఒలిచి పెట్టినట్లుగా పాఠకులకు చెప్పడం అన్నకు కొట్టిన పిండి. తెలంగాణ మట్టి వాసన మరువని, మూలాలను వదులుకోని, పదవులకు అమ్ముడుపోని హృదయాంతరంగాన్ని స్వచ్ఛంగా తనలో నిలుపుకున్నారు కాబట్టే స్వేచ్ఛగా, నిర్భీతిగా, సహజాతి సహజంగా…

Read More

దిశ@4: మీడియా ప్రజాస్వామీకరణ

దిశ లాంటి పేపర్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుంది?.. తెలంగాణ మీడియా సర్కిళ్లలో ఈ మాట కొంతకాలంగా తరచూ వినిపిస్తున్నది. సాధారణ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో వచ్చిన దిశ నాలుగేళ్లలోనే సూపర్ సక్సెస్ కావడం వాళ్లనలా మాట్లాడిస్తున్నది. అప్పటిదాకా ఒక ప్రధాన స్రవంతి దినపత్రిక పెట్టాలంటే పదుల, వందల కోట్లలో పెట్టుబడి అవసరం అయ్యేది. నెలవారీ ఖర్చుల కోసం ప్రభుత్వ ప్రకటనల పైనా, పార్టీల ప్యాకేజీల పైనా ఆధారపడాల్సివచ్చేది. వార్తలపై అనివార్యంగా గుత్తాధిపత్యం కొనసాగేది. ఏ వార్త రావాలి…..

Read More

ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి విజయాన్ని గ్యారంటీ చేసే అస్త్రాలేమీ లేవని, అబ్బురపరిచే కొత్త స్కీంలు తెద్దామన్నా ఖజానా ఖాళీగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారని చెబుతున్నారు….

Read More