అబూజ్మాడ్పై దాడి-3: మావోయిస్టుల ఎత్తుగడలు ఇవేనా?
(డి మార్కండేయ) అబూజ్మడ్ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్ట బెట్టేందుకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం దాడికి సన్నాహాలు చేస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో ఆరోపించింది. మాడ్ కొండలు మావోయిస్టులకు సైనిక, రాజకీయ శిక్షణ కేంద్రంగా మారాయన్నది కేవలం సాకు మాత్రమేనని తెలిపింది. వామపక్ష తీవ్రవాదుల నిర్మూలన పేరుతో ప్రాచీన గిరిజన తెగలలో ఒకటైన మాడియా గోండుల జీవన విధానాన్నీ, సంస్కృతీ సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయబూనుకుంటున్నారని ఆరోపించింది. ఈ కుట్రను బహిర్గత…
