పౌరులపై ‘సాయుధ’ చట్టం ?!
ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ సంచలనం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని మలోం గ్రామ సమీపాన ఓ బస్టాపు వద్ద నిలబడివున్న ప్రయాణికులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన నేపథ్యంలో మరుసటి రోజు షర్మిల తన దీక్షను మొదలుపెట్టింది. ఎవరిని కాల్చుతున్నామో కూడా పట్టించుకోకుండా ప్రజలపై…
