స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

(2013లో రాసిన ఈ వ్యాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బాగా వర్తిస్తుంది.) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయని భావించే ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడడం, పైగా తన చావుకు అధికారుల మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాయడం సంచలనం సృష్టించింది. 2002 బ్యాచ్‌కు చెందిన శర్మ గతం లో బస్తర్‌లోని దంతేవాడ జిల్లా…

Read More

కూడంకుళం.. కుట్ర ఎవరిది?

కూడంకుళం.. ఈ పేరు ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. రష్యా సహకారం తో ₹ 17 వేల కోట్లతో తమిళనాడు కోస్తా తీరంలో ఉన్న ఈ గ్రామంలో చేపట్టిన అణువిద్యుత్ కేంద్రం వివాదాస్పదమైంది. అభివృద్ధి పేరిట తమ ఇళ్లను, జాగలను, బతుకుదెరువును మింగేయడమే కాకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, ఆహారాన్ని సైతం అందకుండాచేసే అణుకేంద్రం వద్దేవద్దని స్థానికులు అంటున్నారు. చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనలు సంభవించి రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ తదితర వ్యాధులు సోకి వేలాది మంది…

Read More

నేపాల్ సైన్యంలో మావోయిస్టులు

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13వేల ప్రాణాలు బలికావడానికి కారణమైన వైరి పక్షాలు త్వరలో ఒకే సంస్థలో కదం కదం కలిపి దేశరక్షణ విధులను నిర్వర్తించబోతున్నాయి. యునిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎస్ఏ)కి చెందిన తొమ్మిది వేల మందికి పైగా గెరిల్లా సైనికులు ప్రభుత్వ సైన్యంలో భాగమయ్యే ప్రక్రియ ఇటీవల అక్కడ మొదలైంది. ఇందుకోసం…

Read More

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ పర్యవేక్షణలో సర్వస్వతంత్రంగా పనిచేసే ఈ కేంద్రానికి ఉగ్రవాదుల కార్యకలాపాలపై గూఢచర్యం నెరపడంతో పాటు దేశంలో ఎక్కడైనా సోదాలు చేసే, ఎవరినైనా అరెస్టు చేసే అధికారాలను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి, ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని పలువురు విమర్శించారు. ఉగ్రవాద నిర్మూలన పేరుతో రాష్ట్రాల…

Read More

నల్లధనం.. తెల్ల బతుకులు..

భారతీయులకు చెందిన సుమారు రూ. 25 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువ వున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏ పీ సింగ్ వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిలో మన దేశ కుబేరులదే అగ్రస్థానమని కూడా ఆయన తెలిపారు. సింగ్ ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ అంశంపై చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే దేశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతుందని, అగ్రరాజ్యంగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాభాలో…

Read More

తాగునీటి పరాయీకరణ

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త.. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే వీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండిగా లాభాలు గడిస్తున్న సామ్రాజ్యవాదులు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుళాయిల వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. గతవారం (2012 ఫిబ్రవరి 1-3) బెంగుళూరు నగరంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో నిర్వహించిన ప్రపంచ నీటి సదస్సు ఈ దిశలో వ్యూహాలను రచించింది. నీటి నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలువురు నిపుణులు, పరిశోధకులు,…

Read More

బిడ్డకు చేతితో తినిపించినా అక్కడ నేరం!

(2012 జనవరిలో రాసిన వ్యాసం ఇది..) ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ్ఞాన శాస్త్రజ్ఞునిగా పని చేస్తున్న అనురూప్ దంపతులు తమ సంతానం మూడేళ్ల అభిజ్ఞాన్, ఏడాది పాప ఐశ్వర్యలపై మమతానురాగాలను చూపించడం లేదన్న కారణంగా అక్కడి బాలల సంరక్షణ చట్టాల ప్రకారం వారిపై కేసు నమోదయింది. కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం పిల్లలిద్దరినీ వారికి 18 ఏళ్లు నిండేవరకూ తల్లిదండ్రుల…

Read More

ఆధార్ ప్రక్రియ అంతా గందరగోళమే..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంబ్లీ గ్రామంలో ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం.. దేశ జనాభాలో కేవలం పది శాతం మందికి కార్డుల జారీ తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది. పార్లమెంటులో కనీస చర్చ లేకుండా 30వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారని కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా పలువురు మేధావులు ప్రారంభంలోనే…

Read More

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు..?

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోందని, రహస్యంగా అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తూ అంతర్జాతీయ అణు ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్పై సైనిక దాడికి సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరానికి ముందు అధ్యక్షుడు ఒబామా ఇరాన్ సెంట్రల్ బ్యాంకుపై ఆర్థిక ఆంక్షలు విధించే ఆదేశాలపై సంతకాలు చేశారు. ఆ దేశ కరెన్సీ రియాల్ విలువ 12 శాతం పడిపోయేలా చర్యలు చేపట్టారు….

Read More

పోస్కోపై మూలవాసుల పోరాటం

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్కో వ్యతిరేక పోరాటం ప్రముఖమైనది. రూ. 60 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఏటా 12 మిలియన్ టన్నుల స్టీలును ఉత్పత్తి చేయడం లక్ష్యం గా భారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి పోస్కో కంపెనీ ఒరిస్సా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు స్థానికులు అత్యంత దృఢమైన, రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారు. జగత్సంగ్పూర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలకు చెందిన సుమారు…

Read More