పని మనుషులా? బానిసలా?

పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకరణ విధానాల ఫలితంగా పెరిగిన పట్టణ ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల నివాసాలే ఈ కొత్త వ్యవస్థకు నిలయాలుగా మారాయి. పంట పొలాల నుంచి పరిక్షిశమలకు కార్మికులుగా, ఉద్యోగులుగా వెళ్లాల్సిన స్త్రీ పురుషులు పనిమనుషులుగా స్థిరపడుతున్నారు. ఏ నగరంలోని ఏ ఇంటిని చూసినా ఇప్పుడు పనిమనుషులో లేక పనిపిల్లలో కనబడడం సాధారణమైంది. యజమాని ఇంట్లోనే నివాసముంటూ 24 గంటలూ…

Read More

బస్తర్.. భారత యేనాన్..

‘‘దండకారణ్యం భారతదేశంలోని అరుణారుణ ప్రాంతం నుంచి ఢిల్లీకి తిరిగివస్తుంటే.. నాకు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఉత్తర షాంగ్సీ లోని యేనాన్ నుంచి కొమింగ్‌టాంగ్ రాజధాని సియాన్‌కు తిరిగివచ్చినట్లనిపించింది. కానీ నేనక్కడ నాలుగు నెలలు గడిపి రాలేదు. కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాను. చైనా విప్లవ కేంద్రమైన పొడి వాతావరణపు ఉత్తర షాంగ్సీకీ, ఇవాళ్టి భారత విప్లవ కేంద్రమైన దండకారణ్యానికీ, బస్తర్ అడవులకూ తేడాలు ఎన్నైనా ఉండవచ్చు. ప్రస్తుత పోరాటపు పర్యవసానం ఏమైనా కావచ్చు..’’ భారత…

Read More

జనాభా లెక్కలు- అపోహలు.. నిజాలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నివేదికలో పొందుపర్చారు. నివాసగృహాల సంఖ్యతో పాటు వాటికి సమకూరివున్న సదుపాయాలు, జనాభా పెరుగుదల రేటు, లింగ నిష్పత్తి, అక్షరాస్యత, జననాల-మరణాల రేటు, సగటు జీవితకాలం, ఎస్‌సీ, ఎస్‌టీలు, మతాల వారీగా జనాభా, పట్టణీకరణ తదితర అనేక వివరాలు ఇందులో ఉన్నాయి. నివేదిక ప్రకారం 2011 మార్చ్ 1 నాటికి దేశ జనాభా…

Read More

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంలో రూ. 2.35 ఖర్చు పెట్టగలిగితే చాలు.. వాళ్లు పేదలు కాదం టూ ఇటీవల ప్రణాళిక సంఘం ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. గత ఐదేళ్లలో దేశంలో పేదరికం 37.2 నుంచి 29.9 శాతానికి తగ్గిందని, 2004-05లో 40 కోట్ల 72 లక్షల సంఖ్యలో ఉన్న పేదలు 2010 మార్చి 1 నాటికి…

Read More

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

(2013లో రాసిన ఈ వ్యాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బాగా వర్తిస్తుంది.) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయని భావించే ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడడం, పైగా తన చావుకు అధికారుల మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాయడం సంచలనం సృష్టించింది. 2002 బ్యాచ్‌కు చెందిన శర్మ గతం లో బస్తర్‌లోని దంతేవాడ జిల్లా…

Read More

నేపాల్ సైన్యంలో మావోయిస్టులు

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13వేల ప్రాణాలు బలికావడానికి కారణమైన వైరి పక్షాలు త్వరలో ఒకే సంస్థలో కదం కదం కలిపి దేశరక్షణ విధులను నిర్వర్తించబోతున్నాయి. యునిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎస్ఏ)కి చెందిన తొమ్మిది వేల మందికి పైగా గెరిల్లా సైనికులు ప్రభుత్వ సైన్యంలో భాగమయ్యే ప్రక్రియ ఇటీవల అక్కడ మొదలైంది. ఇందుకోసం…

Read More

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ పర్యవేక్షణలో సర్వస్వతంత్రంగా పనిచేసే ఈ కేంద్రానికి ఉగ్రవాదుల కార్యకలాపాలపై గూఢచర్యం నెరపడంతో పాటు దేశంలో ఎక్కడైనా సోదాలు చేసే, ఎవరినైనా అరెస్టు చేసే అధికారాలను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి, ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని పలువురు విమర్శించారు. ఉగ్రవాద నిర్మూలన పేరుతో రాష్ట్రాల…

Read More

నల్లధనం.. తెల్ల బతుకులు..

భారతీయులకు చెందిన సుమారు రూ. 25 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువ వున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏ పీ సింగ్ వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిలో మన దేశ కుబేరులదే అగ్రస్థానమని కూడా ఆయన తెలిపారు. సింగ్ ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ అంశంపై చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే దేశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతుందని, అగ్రరాజ్యంగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాభాలో…

Read More

తాగునీటి పరాయీకరణ

పీల్చే గాలి లాగే తాగే నీరూ ఉచితమనుకుంటున్న వారికి దుర్వార్త.. మినరల్ వాటర్ పేరుతో ఇప్పటికే వీటిని అమ్మకపు సరుకుగా మార్చి దండిగా లాభాలు గడిస్తున్న సామ్రాజ్యవాదులు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుళాయిల వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. గతవారం (2012 ఫిబ్రవరి 1-3) బెంగుళూరు నగరంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో నిర్వహించిన ప్రపంచ నీటి సదస్సు ఈ దిశలో వ్యూహాలను రచించింది. నీటి నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలువురు నిపుణులు, పరిశోధకులు,…

Read More

బిడ్డకు చేతితో తినిపించినా అక్కడ నేరం!

(2012 జనవరిలో రాసిన వ్యాసం ఇది..) ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ్ఞాన శాస్త్రజ్ఞునిగా పని చేస్తున్న అనురూప్ దంపతులు తమ సంతానం మూడేళ్ల అభిజ్ఞాన్, ఏడాది పాప ఐశ్వర్యలపై మమతానురాగాలను చూపించడం లేదన్న కారణంగా అక్కడి బాలల సంరక్షణ చట్టాల ప్రకారం వారిపై కేసు నమోదయింది. కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం పిల్లలిద్దరినీ వారికి 18 ఏళ్లు నిండేవరకూ తల్లిదండ్రుల…

Read More