ఆధార్ ప్రక్రియ అంతా గందరగోళమే..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంబ్లీ గ్రామంలో ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం.. దేశ జనాభాలో కేవలం పది శాతం మందికి కార్డుల జారీ తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది. పార్లమెంటులో కనీస చర్చ లేకుండా 30వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారని కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా పలువురు మేధావులు ప్రారంభంలోనే…

Read More

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు..?

ప్రపంచ పోలీసు అమెరికా తాజాగా ఇరాన్పై కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోందని, రహస్యంగా అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తూ అంతర్జాతీయ అణు ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్పై సైనిక దాడికి సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరానికి ముందు అధ్యక్షుడు ఒబామా ఇరాన్ సెంట్రల్ బ్యాంకుపై ఆర్థిక ఆంక్షలు విధించే ఆదేశాలపై సంతకాలు చేశారు. ఆ దేశ కరెన్సీ రియాల్ విలువ 12 శాతం పడిపోయేలా చర్యలు చేపట్టారు….

Read More

పోస్కోపై మూలవాసుల పోరాటం

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్కో వ్యతిరేక పోరాటం ప్రముఖమైనది. రూ. 60 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఏటా 12 మిలియన్ టన్నుల స్టీలును ఉత్పత్తి చేయడం లక్ష్యం గా భారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి పోస్కో కంపెనీ ఒరిస్సా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు స్థానికులు అత్యంత దృఢమైన, రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారు. జగత్సంగ్పూర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలకు చెందిన సుమారు…

Read More

పౌరులపై ‘సాయుధ’ చట్టం ?!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ సంచలనం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని మలోం గ్రామ సమీపాన ఓ బస్టాపు వద్ద నిలబడివున్న ప్రయాణికులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన నేపథ్యంలో మరుసటి రోజు షర్మిల తన దీక్షను మొదలుపెట్టింది. ఎవరిని కాల్చుతున్నామో కూడా పట్టించుకోకుండా ప్రజలపై…

Read More

శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం)తో కొనసాగిన యుద్ధంలో రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వ బలగాలు నిర్ణయాత్మక విజయం సాధించాయి. టైగర్ల అగ్రనేత వేలుపిళై ప్రభాకరన్తో సహా కీలక నేతలు, కమాండర్లు ఆ పోరులో నేలకొరిగారు. మిగిలిన వారు యుద్ధఖైదీలుగా చిక్కి శ్రీలంకలోని వివిధ జైళ్లలో విచారణ నెదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం సింహళ సైన్యాలతో పోరాడి చివరకు ఓడిపోయి నైతిక స్థయిర్యం…

Read More

అమెరికాలో ఇప్పటికీ బానిస వ్యవస్థ!

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్లలో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీలు వందల కోట్లు గడిస్తున్నాయి. శతాబ్దాల క్రితం డబ్బూ మందీ మార్బలం ఉన్న తెల్ల దొరలు ఆఫ్రికా అడవుల నుంచి నల్ల జాతీయులను బంధించి తెచ్చి బానిసలుగా ఉపయోగించుకోవడం గురించి మనకు తెలుసు. కాని కుట్రపూరితంగా నేరాలను ప్రోత్సహిస్తూ, తదనుగుణంగా చట్టాలనూ, శిక్షలనూ ఇష్టానుసారం మార్చుకుంటూ ఖైదీలను నయా బానిసలుగా ఉపయోగించుకుంటున్న వైనం చాలా తక్కువ మందికి తెలుసు….

Read More

అబూజ్‌మాడ్ గోండులు- జీవితం.. పోరాటం..

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దాడి సన్నాహాలు, మావోయిస్టుల ప్రతిదాడుల నేపథ్యంలో అబూజ్‌మాడ్ కొండలు మరోసారి వార్త ల్లోకెక్కాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బసర్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ కొండలు మావోయిస్టులకు అడ్డాగా మారాయని, ఇక్కడి దట్టమైన అడవుల్లో శిక్షణ పొందుతూ బలగాలను సమీకరించుకుని పరిసర ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు నాయకత్వం కూడా ఇక్కడే ఆశ్రయం పొందుతూ దేశ వ్యాప్తంగా కార్యకలాపాలను సమన్వయిస్తోందని వారు చెబుతున్నారు. ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పిఎల్‌జీఏ)…

Read More

అబూజ్‌మాడ్‌పై దాడి-3: మావోయిస్టుల ఎత్తుగడలు ఇవేనా?

(డి మార్కండేయ) అబూజ్మడ్ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్ట బెట్టేందుకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం దాడికి సన్నాహాలు చేస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో ఆరోపించింది. మాడ్ కొండలు మావోయిస్టులకు సైనిక, రాజకీయ శిక్షణ కేంద్రంగా మారాయన్నది కేవలం సాకు మాత్రమేనని తెలిపింది. వామపక్ష తీవ్రవాదుల నిర్మూలన పేరుతో ప్రాచీన గిరిజన తెగలలో ఒకటైన మాడియా గోండుల జీవన విధానాన్నీ, సంస్కృతీ సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయబూనుకుంటున్నారని ఆరోపించింది. ఈ కుట్రను బహిర్గత…

Read More

అబూజ్‌మాడ్‌పై దాడి-2: సైన్యాన్ని దించుతారా..?

(డి మార్కండేయ) దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో దుర్భేద్యమైన బెర్రయిన్‌ను కలిగివున్న అబూజ్మడ్ ప్రాంతంపై దాడి చేయడమంటే మాటలు కాదు. ఏ దారి ఎటు వెళుతుందో, ఏ పల్లె ఎక్కడుందో, ఎక్కడ ఏ వాగు అడ్డం తగులుతుందో, ఏ వ్యక్తి ఏ ఊరికి చెందినవాడో, ఏ మూలన ఏ ప్రమాదం పొంచివుందో స్థానిక ఆదివాసులకు తప్ప బయటి వారికి అసలే తెలియని ప్రాంతమిది.. ఎక్కడికి చేరాలన్నా కాలినడక తప్ప మరో మార్గం లేదు. సముద్రమట్టానికి…

Read More

నక్సల్స్ ఓటు బ్యాంకు ఎటువైపు?

రాష్ట్రం లో ఎన్నికల వాతావ రణం వేడెక్కింది. అన్ని పార్టీ లూ తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటించాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, దళిత, బలహీన, మైనారిటీ వర్గాల్లో పట్టు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుండగా, వైఎస్ సర్కారు అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తుల సమీకరణ తమను తప్పక విజయ పథాన నడిపిస్తుందని తెలుగు దేశం భావిస్తోంది. సేవే లక్ష్యం.. ప్రేమే మార్గమంటూ పార్టీ స్థాపించిన…

Read More