నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్-1 సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా ఉన్న పండోరా గ్రహంపై కన్నేసిన మానవుల కథ అది. ఆ గ్రహంపై నవీ అనే పేరున్న భారీ విచివూత శరీరాకృతి కలిగిన మూలవాసులు నివసిస్తారు. వీళ్లు ప్రకృతి ప్రేమికులు. అడవిపై ఆధారపడి జీవిస్తారు. కొండదేవతను ఆరాధిస్తారు. ఆ దేవత కొలువైన పర్వతక్షిశేణుల్లో ఖనిజనిల్వలున్నట్లు గుర్తించిన మానవులు వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. నవీలను పోలిన మానవ…

Read More

ఎన్నికల తర్వాతే మావోయిస్టులతో అమీ తుమీ!

( డి మార్కండేయ) ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతల హత్య నేపథ్యంలో ప్రతీకారం కోసం ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నప్పటికీ మావోయిస్టులపై వెంటనే భారీగా తెగబడడానికి యూపీఏ సర్కారు వెనుకడుగు వేస్తు న్నది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే సైన్యాన్ని సైతం దింపి వారి భరతం పట్టాలని నిర్ణయించింది. అప్పటికి ఎండాకాలం వస్తుందని, అదే అనువైన సమయమని, ఈ లోపు యుద్ధసన్నాహాలు పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆజ్ఞలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాత…

Read More

అన్నల రాజ్యం-5: ఇళ్ల దహనాలు ఇక్కడ కామన్..

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్లు ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. కూలీ రేట్లు పెంచాలని, కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు అరికట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు సభలు పెట్టినా, ర్యాలీలు తీసినా, బంద్లు నిర్వహించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. విసిగి వేసారి చివరకు మావోయిస్టుల గైడెన్స్లో స్వయంపాలనకు పూనుకుంటే మాత్రం వెంటనే బలగాలను దించి భయపెట్టే, బలప్రయోగం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు….

Read More

అన్నల రాజ్యం-4: ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లింది ఇలా..!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మా ఛత్తీస్గఢ్ పర్యటన ఎంతో ఉద్వేగభరితంగా ఆరు రోజులు సాగింది. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనుల మధ్య ఇరుకు గదుల్లో ఫోన్లతో మాట్లాడుతూ టీవీలతో సావాసం చేస్తూ ఫేస్బుక్కుల్లో పలకరిస్తూ తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో రేపటి గురించిన ఆందోళనతో బతికే మాకు ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల జనతన సర్కారు చెక్పోస్టు దాటగానే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపించింది. అక్కడ సమష్టి తత్వం సర్వవ్యాపితం. బతుకైనా, చావైనా, పండుగైనా, పోరాటమైనా అన్నీ కలిసే….

Read More

అన్నలరాజ్యం-3: విముక్తి ప్రాంతాలు ఏర్పాటుచేస్తారా?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) ఎమర్జెన్సీ తదనంతరం కేంద్ర ఆర్గనైజర్ల రూపంలో రైతాంగాన్ని, యువతీ యువకులను ప్రజాసంగాల్లోకి సమీకరించిన నక్సలైట్లు ఆ తర్వాత క్రమంగా తమ నిర్మాణాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకున్నారు. భూస్వాముల, గూండాల దాడుల నుంచి రక్షణ కోసం ఒక ఆర్గనైజర్, ఇద్దరు సభ్యుల (1+2) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఆ సభ్యుల వద్ద తపంచాలు, నాటుబాంబులు ఉండేవి. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలపై సైతం దాడి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 1985 నుంచి ఐదుగురి…

Read More

అన్నల రాజ్యం-2: నాలుగు జిల్లాల్లో సమాంతర సర్కార్లు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) కటిక చీకట్లలో కడు పేదరికంతో కూడు, గూడు, గుడ్డ కరువైన దీనస్థితిలో బతుకుతున్న బస్తర్ ఆదివాసులకు 1980లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశించిన నక్సలైట్లు దేవుళ్లలా కనిపించారు. అభివృద్ధి పేరుతో అటవీ సంపదను, ఖనిజ వనరులను దోచుకెళుతున్న ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు చేస్తున్నదేమీ లేదని అన్నలు చెప్పిన మాటలను మొదట వాళ్లు నమ్మలేదు. అయితే కాలక్రమంలో పాలకుల పట్టించుకోనితనం, అటవీ సిబ్బంది అరాచకాలు, కాంట్రాక్టర్ల, షావుకార్ల దోపిడి వారిని మావోయిస్టులకు దగ్గర…

Read More

అన్నల రాజ్యంలో ఆరు రోజులు: బస్తర్‌లో మావోయిస్టు సర్కారు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మధ్యభారత అడవుల్లో ఓ కొత్త వ్యవస్థ పురుడు పోసుకుంటోంది. దేశ వనరులను బహుళజాతి సంస్థలకు దఖలు పరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై అక్కడి ఆదివాసీలు తిరగబడుతున్నారు. మావ నాటె మావ రాజ్ (మా ఊళ్లో మా ప్రభుత్వం) అనే నినాదంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీ అండతో ఊరూరా క్రాంతికారీ జనతన సర్కార్ల (విప్లవ ప్రజా సమితి)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమిస్తున్నారు. మానవజాతి మనుగడకు,…

Read More

అబూజ్‌మాడియాలకు ముప్పు!

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడు తూ స్వేచ్ఛగా, దర్జాగా బతికిన మాడియా గోండులు ఏ క్షణం ఏం జరుగుతుం దో, ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకురానుందో తెలియక భయంభయంగా బతుకుతున్నారు. ఉధృతంగా సాగుతున్న మావోయిస్టుల కార్యకలాపాలు, ఆ కార్యకలాపాల అణచివే త పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాల ముప్పేట దాడులు కలిసి వారి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.శిక్షణ స్కూలు నెపంతో గుట్టల అంచున…

Read More

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

సెరిబ్రల్ మలేరియాతో తెహెల్కా ఫొటోగ్రాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే,…

Read More

ఈశాన్యం భారతంలో మావోయిస్టులు

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగప్రవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయుధ ఉద్యమాలు నడిపిన అనేక సంస్థలు ఇటీవలికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని పోరాటాలను విరమించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రాల్లో ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘనమైన పోరాట చరిత్ర కలిగిన ఈశాన్య ప్రాంత ఆదివాసుల్లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసి వారిని విప్లవ పోరాటాల వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రాల్లో భారత కమ్యూనిస్టు…

Read More