కమలనాథులా? కాంగ్రెస్సా?

రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ మరోసారి వేడెక్కించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఓ పార్టీ పైన వాడి వేడి విమర్శలు సంధించో, పథకాన్ని ప్రకటించో బాంబులు పేల్చే ఆయన గత నెల నుంచీ భారతీయ జనతా పార్టీపై పడ్డారు. వరుస ప్రెస్ మీట్లలో వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం పైనా, కమలనాథుల పైనా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఖబడ్దార్ బీజేపీ.. దేశంలో అగ్గి పెడతం.. వెంటాడుతాం.. వేటాడుతాం.. మెడలు వంచుడు కాదు.. నీ మెడలు విరుస్తాం…

Read More

కేసీఆర్ సార్.. మీరు మారాలి!

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ మొదలైంది. బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఊరూరా అభివృద్ధి పనులు చేపట్టినా, పెండింగులో ఉన్న బిల్లులన్నీ మంజూరు చేసినా, చివరకు ఓటు వేసే ప్రతి వ్యక్తికీ రూ. ఆరు వేల నగదు ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి 23,855 ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రతిష్టకు అవమానకర భంగపాటు అని, ఇక రాష్ట్రంలో కమలనాథులదే…

Read More

కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలకమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో…

Read More

హుజూరాబాద్‌లో చివరకు నోటుదే విజయమా?

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రధాన పార్టీలు తమ యుద్ధ మోహరింపులను పూర్తి చేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో దిగగా, అధికార పార్టీ తరఫున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. మరో 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా అందరి దృష్టీ రెండు పార్టీల పైనే ఉంది. కాంగ్రెస్ బరిలో ఉన్నా…

Read More

అక్కడ పగలు టీఆర్ఎస్.. రాత్రి బీజేపీ!

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ కాకుండా 15మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దసంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుండగా, ఉపసంహరణకు గడువు ఈ నెల 13 వరకూ ఉంది. చివరకు బరిలో ఎంతమంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యనే…

Read More

ఎంఐఎం.. బీజేపీకి బీ టీమ్?

వచ్చే ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆ మధ్యన ప్రకటించారు. భాగీదారీ సంకల్ప్ మోర్చాతో ఈ మేరకు ఎన్నికల ఒప్పందం కుదిరిందని, మరే పార్టీతోనూ పొత్తు ఉండబోదని ప్రకటించారు. బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని, అధికార పీఠాన్ని ప్రభావితం చేయగలిగే సంఖ్యలో సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. ఏళ్లుగా కేవలం తెలంగాణ, అదీ హైదరాబాద్…

Read More

కేసీఆర్ ఢిల్లీ వ్యూహాలు ఫలించేనా!

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఈ వారం వార్తల్లో నిలిచింది. ఈ నెల 1న వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. విభజన సమస్యలు, జలవివాదాలు, రాష్ట్రాభివృద్ధికి నిధులు సహా పలు అంశాలను ఆయన వారితో చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. కాగా, కేసీఆర్-మోడీల భేటీ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన నాలుగు శాసనసభ…

Read More

రేవంత్‌రెడ్డి టార్గెట్ 2023 ఇదే!

2018 ప్రారంభంలో నాకు తెలిసిన ఓ మేధావి మిత్రుడు రేవంత్‌రెడ్డిని కలిసారు. అప్పటికి ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మూడు, నాలుగు నెలలవుతోంది. ఆయనకు పీసీసీ సారథ్య బాధ్యతలు ఇస్తారని, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం అభ్యర్థి అని తెలుగు మీడియా కోడై కూస్తున్నది. అదే విషయాన్ని నా మిత్రుడు ప్రస్తావిస్తే, ప్రస్తుతం తన టైం రాలేదని, చేయాల్సిన పనులు చాలా మిగిలివున్నాయని అన్నారట. హైకమాండ్ వెంటనే తనకు ఆ పదవి ఇచ్చినా తీసుకోవడం…

Read More

కేసీఆర్ మదిలో మధ్యంతర ఎన్నికలు?

రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. లెక్క ప్రకారం 2023 డిసెంబర్ వరకూ ప్రస్తుత శాసనసభ కాలం ఉన్నా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. దళితులను ఆకట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించడానికే అంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన చేసిన ప్రసంగం వింటే త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. దళితబంధును రాష్ట్రమంతా పకడ్బందీగా అమలుచేస్తామని, దళితవాడల్లో అన్ని…

Read More

హుజూరాబాద్.. మినీ 2023?

ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును కేసీఆర్ రంగంలోకి దించారు. సిద్దిపేట సమీపంలోని రంగనాయక్‌సాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా ‘ఆపరేషన్ హుజూరాబాద్’ కొనసాగుతున్నది. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, వీరవిధేయుడు ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో పల్లెపల్లెనా ఈటల వ్యతిరేక ప్రచారం కొనసాగుతున్నది. ఇప్పటికే మండలానికో మంత్రిని లేదా ఎమ్మెల్యేను, గ్రామానికో నేతను అన్నట్టుగా ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి యాభై లేదా వంద మంది ఓటర్లకు ఒక పోల్ మేనేజ్‌మెంట్ పర్సన్‌ను కేటాయించాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడవద్దని…

Read More