జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు గడ్చిరోలి మహిళా నేత నటాషా మృతి

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ( డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ) సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్‌తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ ఈ వారంలో జరిగిన రెండవ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీభాగ్…

Read More

దిశ ఎడిటర్ మార్కండేయపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడి.. ఆయన జవాబు..

మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను రాజకీయ విశ్లేషణ రాసిన తర్వాత నా పైన కొందరు అప్రజాస్వామికంగా దాడి చేస్తున్నారు. వారు ప్రజాస్వామికంగా నేను రాసిన విషయాలను విభేదిస్తూ, విమర్శిస్తూ ఏమైనా రాసుకోవచ్చు. కాని నా పైన వ్యక్తిగత దాడి చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. నేను పార్టీలోకి వెళ్లిందీ, తిరిగివచ్చిందీ ఏ పరిస్థితుల్లో అనే వివరాలు నేను రాసిన సంపాదకీయాల(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో వచ్చాయి.) సంపుటి మలుపు పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ’’మరోకోణం‘‘ అనే పుస్తకంలో…

Read More

దేవ్‌జీ, సోనూ వర్గాలు ఏకమవుతాయా?

(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక…

Read More

మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగిపోతారా?

(దూడం మార్కండేయ) ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కాని ఆ సుప్రీం జాడే లేదు. కొండపల్లి…

Read More

మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా తెలంగాణ.. నిఘా వర్గాల హై అలర్ట్!

మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్‌జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు….

Read More

తెలంగాణలోనే మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ? పోలీసులు ఏం చెబుతున్నారు?

మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా, మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్‌జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు…

Read More

టైగర్ల ఓటమిపై సమగ్ర సమీక్ష.. అన్వయించడంలో మావోయిస్టులు ఫెయిల్!

ప్రత్యేక తమిళ ఈలం(తమిళ దేశం) కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఎల్టీటీఈ 2009 మేలో అంతిమ ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీలంక ఉత్తర, పూర్వ తమిళ ప్రాంతాల్లోని మెజారిటీ భూభాగాన్ని ఏళ్ల తరబడి తన కంట్రోలులో ఉంచుకుని, పాలన చేపట్టి, వాయు, నౌకాబలగాలు సహా 40వేలకు మించిన రెగ్యులర్ సైన్యాన్ని కలిగిన ఎల్టీటీఈ.. స్థావరయుద్ధంలో ఇరుక్కుపోయి చివరకు ఘోర ఓటమిని చవిచూసింది. క్రమక్రమంగా శ్రీలంక సైన్యాలు తమ భూభాగాన్ని చుట్టుముడుతున్నాయని, తమ ఏరియా కుంచించుకుపోతున్నదని తెలిసినా,…

Read More

ఆసిఫాబాద్ లో మావోయిస్టులు.. డిజీపీ ప్రెస్ మీట్‌పై ఉత్కంఠ..

మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ లో కొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వారిలో ఎవరైనా నాయకులు ఉన్నారా? తెలంగాణ కేడర్ ఉన్నారా? మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్లేనా? వంటి విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే, ఆ సస్పెన్స్ ఈరోజు వీడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు హైద్రాబాద్ లోని డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టులో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు పోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల లొంగుబాటును లేదంటే అరెస్ట్ ను చూపించడానికే ఈ సమావేశం…

Read More
25.12.2022-Marokonam

వారి త్యాగాలను గౌరవిద్దాం!

‘విప్లవ మేధావి, మావోయిస్టు నేత ఎల్ఎస్ఎన్ మూర్తి క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ గత బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. యాభై సంవత్సరాలకు పైగా పూర్తికాలం కార్యకర్తగా పనిచేసిన ఆయనకు సొంత కుటుంబం కానీ, ఆస్తి కానీ లేవు. కొంతమంది దాతల సాయంతో నగర శివారులోని సీఆర్ ఫౌండేషన్‌లో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందారు.’ ‘సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసిన యాభై ఐదేళ్ల ఆలూరి ఉష క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవలే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ముప్పై ఏళ్ల తర్వాత జనజీవన…

Read More

కమ్యూనిస్టులు కనుమరుగేనా!

తెలంగాణ అంటేనే బయటి ప్రపంచానికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు గుర్తొస్తారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మేం తెలంగాణ నుంచి వచ్చామని చెప్తే, కాస్త అనుమానపు చూపులు చూడడం చాలా మందికి అనుభవమే. మనది పోరాటగడ్డ అని, జనాలలో తిరుగుబాటు మనస్తత్వం ఉంటుందని భావించడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 1946-51 మధ్య ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేతృత్వంలో కొనసాగిన రైతాంగ సాయుధపోరాటం చరిత్ర పుటలలో నిలిచిపోయింది. వేలాది రైతాంగ గెరిల్లాలు ఆయుధాలు చేబూని 41 వేల చ.కి.మీ….

Read More