ప్రాంతీయమే ప్రత్యామ్నాయమా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విషయాన్ని స్పష్టంగా తేల్చేశాయి. ఇప్పటిదాకా ఒక జాతీయ పార్టీగా, దేశ ప్రజల ఎదుట భారతీయ జనతా పార్టీకి కనీస ప్రత్యామ్నాయంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో ఆ అర్హతను కోల్పోయింది. పవర్లో ఉన్న పంజాబ్తోపాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో ఆ పార్టీ ఘోరంగా బొక్క బోర్లా పడింది. ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక దృష్టి కేంద్రీకరించినా యూపీలో కేవలం…
