చింతలు తీర్చని చింతన్ శిబిర్!

  కష్టాల కడలిలో జీవన్మరణ పోరాటం చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గట్టెక్కే మార్గాలను వెతకడానికి ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌’ నిర్వహించింది. నాయకత్వపరంగా, సంస్థాగతంగా, రాజకీయంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేధోమథనం జరిపింది. చివరిరోజు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పేరిట కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పార్టీ పునరుజ్జీవం కోసం పైనుంచి కింది స్థాయి వరకు సంస్థాగత సంస్కరణలు చేపట్టడానికి ఒక టాస్క్‌‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. రాజకీయ వ్యవహారాలపై…

Read More

పుస్తకాలు కొనడమేనా.. చదివేది ఏమైనా ఉందా..?

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఏర్పాట్లు ఎన్టీఆర్ స్టేడియంలో వేగంగా జరుగుతున్నాయి. కరోనా తర్వాత బుక్ ఫెయిర్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఈతరం యువతీ యువకులు, జెన్‌జీ తరం సైతం పెద్దయెత్తున వచ్చి పుస్తకాలు కొంటున్నారు. జిల్లాల నుంచి కూడా సందర్శకులు వచ్చి చూసి పోతున్నారు. ఆ పది రోజులూ హైదరాబాద్ వీధులు పుస్తకాల శోభను సంతరించుకుంటున్నాయనడంలో కూడా అతిశయోక్తి లేదు. ప్రముఖులు కలిసే చోటు.. బుక్ ఫెయిర్ అనేది కొత్త, పాత…

Read More

కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరు సాధ్యమా?

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ సభకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. బీజేపీపై కేసీఆర్…

Read More

బీ టీంలే బీజేపీని గెలిపిస్తున్నాయా?

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) నేత అతిషీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాల్లోనూ బరిలో దిగుతామని, మార్చ్ మొదటివారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అమలుచేస్తున్న పథకాలను కర్ణాటకలో కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. పార్టీ కర్ణాటక అధ్యక్షుడు పృథ్వీరెడ్డి కూడా ఇదే విషయాన్ని అనేక సభల్లో ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్)ల పట్ల…

Read More

టీ-కాంగ్రెస్.. వీళ్లు మారరా!?

జగ్గారెడ్డి ఉదంతం మరోసారి టీ-కాంగ్రెస్‌ను వార్తల్లో నిలిపింది. పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని, పైగా కోవర్ట్‌ గా ముద్ర వేసి బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇటీవల రాజీనామాకు సిద్ధమయ్యారు. పలువురు సీనియర్ నేతలు బతిమాలినా తన నిర్ణయాన్ని మార్చుకోబోవడం లేదని ప్రకటించారు. పార్టీ అధినేత్రి సోనియాకు, యువనేత రాహుల్‌కు ఈ సందర్భంగా ఆయన మూడు పేజీల లేఖ రాశారు. పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని దుయ్యబట్టారు….

Read More

మునుగోడులో బీజేపీ ఓడింది.. మోడీ-షా గెలిచారు!

మునుగోడులో 10వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడం ఆ పార్టీకి గొప్ప ఊరటగా భావించవచ్చు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలగి, పదవికి రాజీనామా చేసిన ఫలితంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ తమ బలగాలను భారీగా మోహరించాయి. అర్థ, అంగ బలాలను విచ్ఛలవిడిగా వినియోగించాయి. ఓటుకు రూ. 3నుంచి 5వేల వరకు వెచ్చించాయి. టీఆర్ఎస్ వంద మంది వరకు మంత్రులు,…

Read More

సుఖజీవులు నశించాలి!

మనుగడ కోసం పోరాటం చేసిన క్రమంలోనే మానవుడు ప్రస్తుత ఈ రూపానికి పరిణామం చెందాడని ప్రముఖ జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం మనకు చెబుతుంది. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు.. జలచరాల నుంచి ఉభయచరాలు, భూచరాలు ఉద్భవించాయని, ఈ పరిణామ క్రమంలోనే డైనోసార్లు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఉనికిలోకి వచ్చాయని, కోతి నుంచి చివరకు మానవుడు రూపుదిద్దుకున్నాడని ఆయన రెండు వందల ఏళ్ల క్రితమే ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఆమోదించింది కూడా. ఈ…

Read More

దృష్టి మళ్లింపు వ్యూహంలో భాగమే బీఆర్ఎస్!

కేసీఆర్ కొత్త పార్టీపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. దేశ్ కీ నేతా కేసీఆర్.. అంటూ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే, ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆయన పార్టీ చేసేదేముండదని కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు విమర్శించాయి. ఇప్పటికే అధికార పార్టీ వెనక చేరిన సీపీఐ, సీపీఎం మాత్రమే  స్వాగతించాయి. కాగా, ఢిల్లీ స్థాయిలో కొత్త పార్టీ ప్రకటనపై స్పందన కరువైంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను ఎవరూ పెద్దగా పట్టించుకోనేలేదు. ప్రత్యేక రాష్ట్ర…

Read More

ఆర్టీసీ ఒక్కటే ఎందుకు? ప్రభుత్వాన్నే అమ్మేయండి!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆస్తులను అమ్మాలని, లీజుకు ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇలా సమకూరిన ఆదాయాన్ని ఇప్పటికే పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి ఉపయోగించాలని, భవిష్యత్తులో నష్టాల నివారణకు తక్షణం బస్సు చార్జీలు పెంచాలని కూడా ఆర్టీసీ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయని కొత్తగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. మూడు నాలుగు…

Read More