రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?

తెలంగాణలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్, 21న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరస మీటింగులతో ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. కమలం పార్టీ దేశానికి ఒక్క మంచి పని చేయలేదని, అన్నీ…

Read More

మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వస్తున్నట్లు?

రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ తర్వాత ఇప్పుడు మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరగనుంది. 2018 ఎన్నికలలో అక్కడ గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ్యత్వాన్ని వదులుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన గురువారం రాజీనామా చేశారు. తాను పార్టీని వదిలి వెళ్లడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే కారణమని, అనేకమార్లు పార్టీలు మార్చి, ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఆధ్వర్యంలో తాను పనిచేయలేనని ఈ…

Read More
Marokonam

అంబానీ..అదానీ.. మధ్యలో ప్రధాని!

ప్రపంచ ఐశ్వర్యవంతుల టాప్ టెన్‌లో ఉన్న అంబానీ, అదానీ పేర్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. టీవీలు, పేపర్లు, వెబ్‌సైట్‌లలో వార్తలు చూసే ప్రతి ఒక్కరికీ ఈ ఇద్దరు చిరపరిచితులు అయ్యారు. ప్రధాని మోడీ గుజరాతీ షావుకార్లకు సేల్స్‌మన్‌గా మారిపోయారని సీఎం కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీరిపై చర్చ జోరందుకుంది. తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ ఆక్షన్‌లో అదానీ కంపెనీ ఎల్-1 గా నిలవడం వివాదాస్పదమైంది. పొరుగు…

Read More

పార్టీలు వేర్వేరు.. ఆచరణ ఒక్కటే!

గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ పైన, మోడీ పైన కేసీఆర్ చేసిన విమర్శలన్నీ తనకు నిజాలు అనిపిస్తున్నాయట. మంచిదే కదా, ఇంకేంటి ప్రాబ్లం? అంటే అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన బండి సంజయ్…

Read More

కమల‘బంధం’లో తెలంగాణ

మూడు రోజులుగా కాషాయ జెండాలతో తెలంగాణ రెపరెపలాడిపోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ పదాధికారులు దాదాపు అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. మోడీ పాలనను పొగుడుతూ, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తూలనాడుతూ ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. సమావేశాలు జరుగుతున్న రాజధాని హైదరాబాద్‌లో అయితే హడావుడి ఆకాశాన్నంటేలా ఉంది. నగర కూడళ్లలో, రోడ్లపై ఎక్కడ చూసినా బీజేపీ అగ్రనేతలను స్వాగతిస్తూ కట్టిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అధికార…

Read More

నిజాం కాలం నాటి ప్రముఖ విమానాశ్రయం తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా….?

నిజాం కాలంలో తెలంగాణలో నిర్మించిన కట్టడాలు, గుళ్లు, ప్రసిద్ధి స్థలాలు, కోటలు… ఇలా చెబుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, కుష్ మహల్, భద్రకాళి దేవాలయం ఇలా చాలానే ఉన్నాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన…

Read More

గెలుపు కోసం కేసీఆర్ త్రిముఖ వ్యూహం..

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్@పీకే టీం సర్వే నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా లేని నియోజకవర్గాలలో నష్టనివారణ చర్యలు చేబడుతున్నారు.40 మంది వరకు…

Read More
G SAT

జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాం నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌, కేంద్ర ప్రభుత్వం.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం 4,180 కిలోల బరువు.. 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. ఈ ఉపగ్రహాం…

Read More

సరళ తరం ఇప్పుడేది!?

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడంతా ‘విరాటపర్వం’ సినిమా పైనే చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని సరళ నిజజీవిత కథపై తీసిన ఈ మూవీ మొన్నటి శుక్రవారం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విప్లవ సానుభూతిపరులతో పాటు ఆలోచనాపరుల, నేటి తరం యువతీ యువకుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. వేణు ఊడుగుల దర్శకత్వ ప్రతిభకు, కథ పట్ల కమిట్మెంటుకు పట్టం కడుతూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రివ్యూలు వస్తున్నాయి. 1992లో ఇంటర్ చదువుతూ విప్లవ రాజకీయాలపైన, విప్లవకారులపైన…

Read More

చట్టాలకు కొందరు చుట్టాలు!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులందరూ పలుకుబడి కలిగినవర్గాలకు చెందినవారు కావడం, ఘటనపై స్పందించి, చర్యలు చేపట్టడంలో పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించడం, ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, ఘటనకు ఓ రాజకీయపార్టీ మతం రంగు పులమడానికి ప్రయత్నించడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. గత నెల 28న ఆమ్నీషియా పబ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన బాధిత బాలికను ఐదుగురు నిందితులు ట్రాప్ చేసి ఇన్నోవా, బెంజ్ కార్లలో…

Read More