రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?
తెలంగాణలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్, 21న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరస మీటింగులతో ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. కమలం పార్టీ దేశానికి ఒక్క మంచి పని చేయలేదని, అన్నీ…
