ఓటుకు నోటా.. నోటుకు ఓటా?

ఓటుకు నోటు కేసు గురించి వినని తెలుగువారుండరు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థికి ఓటు వేయడం కోసం టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షల నగదు ఇస్తూ అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 2015లో జరిగిన ఈ ఘటనపై నమోదైన కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవలే నిందితులపై అభియోగాలను నమోదు చేసిన ఏసీబీ కోర్టు త్వరలో సాక్షులను విచారించనుంది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 171(బీ) ప్రకారం ఓటు…

Read More

మేం మారం.. మీరు మారండి

‘ఈ మధ్యనే ఇంటర్నేషనల్ మీడియాలో ఓ వార్త వచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటించలేదని నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్‌బెర్గ్‌కు ఆ దేశ పోలీస్ చీఫ్ 2352 డాలర్ల (సుమారు లక్షా 76 వేల రూపాయలు) ఫైన్ విధించారని ఆ వార్త సారాంశం. ఆమె ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు విందులో హాజరైనవాళ్లు మాస్క్ ధరించలేదని, సోషల్ డిస్టెన్స్ పాటించలేదని ఈ చర్య తీసుకున్నారు. పోలీస్ చీఫ్ చర్యను వ్యతిరేకించకుండా ఆ జరిమానా చెల్లించడమే కాకుండా సోల్‌బెర్గ్‌ దేశ ప్రజలకు…

Read More

పౌరుల ఇంటర్‌నెట్‌పై కన్నేసిన ప్రభుత్వం..

పౌరుల ఇంటర్ నెట్ కార్యకలాపాలపై సర్కారు కన్నుపడింది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే నెపంతో ఆది త్వరలో మెయిళ్లపై, బ్లాగులపై, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై, నెట్ ద్వారా జరిపే సంభాషణలపై అస్త్రం సంధించబోతోంది. ఈ మాధ్యమం ద్వారా వెళ్లే టెక్స్ట్ మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలను ఇకనుంచి నిఘా సంస్థలు కనిపెట్టి ఉంచుతాయి. నేత్ర పేరుతో అమలయ్యే ఈ ప్రాజెక్టును ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో, కేబినెట్ సెక్రెటేరియట్లు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఓకే చెప్పాయి….

Read More

నియాంగిరి కొండల్లో అవతార్ కథ..

మీరు అవతార్-1 సినిమా చూశారా! క్రీస్తుశకం 2150 నాటికి భూగర్భంలో గల అన్ని వనరులూ హరించుకుపోగా,ఉనోబ్టానియం అనే విలువైన ఖనిజం మెండుగా ఉన్న పండోరా గ్రహంపై కన్నేసిన మానవుల కథ అది. ఆ గ్రహంపై నవీ అనే పేరున్న భారీ విచివూత శరీరాకృతి కలిగిన మూలవాసులు నివసిస్తారు. వీళ్లు ప్రకృతి ప్రేమికులు. అడవిపై ఆధారపడి జీవిస్తారు. కొండదేవతను ఆరాధిస్తారు. ఆ దేవత కొలువైన పర్వతక్షిశేణుల్లో ఖనిజనిల్వలున్నట్లు గుర్తించిన మానవులు వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. నవీలను పోలిన మానవ…

Read More

పౌరులపై నిఘా నేత్రం

పౌరుల ‘ప్రైవసీ’ పై కేంద్రం మరో అస్త్రం సంధించింది. టెర్రరిస్టు, విచ్ఛిన్నకర కార్యకలాపాలను అదు పు చేసే నెపంతో ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిళ్లు, వెబ్‌బ్రౌజింగ్‌లపై నిఘా పెట్టింది.ఇందుకోసం ఇండియన్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ (భారత కేంద్ర పర్యవేక్షక వ్యవస్థ-ఐసీఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నది. గత సంవత్సరం డిసెంబర్‌లో ఐటీ మంత్రి మిలింద్ దేవ్‌రా ఐసీఎంఎస్ ఏర్పాటును పార్లమెంటులో ప్రకటించారు.ఈ ప్రయత్నాలు ఏప్రిల్‌లో కొలిక్కి వచ్చాయి. ప్రయోగాత్మకంగా ఫోన్లపై, వెబ్‌సైట్లపై పర్యవేక్షణ మొదలైంది. దీంతో ఇకముందు నిఘా సంస్థలు…

Read More

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును చర్చకు పెట్టే వీలు కుదరకపోవడంతో కేంద్ర కేబినెట్ హడావుడిగా గత బుధవారం ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించి సంతకం కోసం రాష్ట్రపతికి పంపించింది.శుక్రవారం రాజ్యాంగ అధినేత అయిన ప్రణబ్ ఆమోదముద్ర కూడా వేశారు. సోనియాగాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ బిల్లు భారత పౌరుల్లో మూడింట రెండు వంతుల జనాభాకు ఆహార భద్రతను కల్పిస్తుంది. జీవించడానికి అవసరమైన…

Read More

అభివృద్ధి విలయ తాండవం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ, రుద్రవూపయాగ జిల్లాలను సర్వనాశనం చేసింది. ఉగ్రరూపం దాల్చిన నదుల తాకిడికి రహదారులు, వంతెనలు ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయి. బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు పేకమేడల్లా కూలిపోయా యి. రోజులు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతున్నది. కేదార్‌నాథ్ పరిసరాల్లో కుప్పలుగా మృతదేహాలు పడివున్నాయనీ, కుళ్లిపోతున్నాయనీ వార్తలు వస్తున్నాయి. నదుల ఒడ్డున, శిథిలాల్లో, రోడ్ల వెంట ఇప్పటికీ శవాలు…

Read More

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది గంటలకు ఆ జిల్లాకు చెందిన ఏటపల్లి తాలూకాలోని సుర్జాగఢ్ గుట్టల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులను నక్సల్స్ నరికి చంపారు.చనిపోయిన ముగ్గురిలో ఒకరు ప్రముఖ బహుళజాతి సంస్థ లాయిడ్స్ స్టీల్ కంపెనీకి చెందిన ఉన్నతస్థాయి అధికారి.5వేల కోట్ల టర్నోవర్ కలిగిన ఈ కంపెనీ ప్రధానంగా ఉక్కు పరిక్షిశమలను కలిగివున్నది. ఈ కంపెనీకి వైస్‌వూపెసిడెంట్ అయిన జస్పాల్ థిల్లాన్, లాయిడ్స్‌కు…

Read More

ఎన్నికల తర్వాతే మావోయిస్టులతో అమీ తుమీ!

( డి మార్కండేయ) ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతల హత్య నేపథ్యంలో ప్రతీకారం కోసం ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నప్పటికీ మావోయిస్టులపై వెంటనే భారీగా తెగబడడానికి యూపీఏ సర్కారు వెనుకడుగు వేస్తు న్నది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే సైన్యాన్ని సైతం దింపి వారి భరతం పట్టాలని నిర్ణయించింది. అప్పటికి ఎండాకాలం వస్తుందని, అదే అనువైన సమయమని, ఈ లోపు యుద్ధసన్నాహాలు పూర్తి చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆజ్ఞలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాత…

Read More