రేవంత్ చికిత్స ఫలించేనా!

ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. అంతర్గత కుమ్ములాటలతో అధ్వానస్థితికి చేరిన రాష్ట్ర యూనిట్‌కు సారథ్యం వహించే బాధ్యతను ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి అప్పగించింది. అందరూ ఊహించిన విధంగానే పలువురు సీనియర్ నేతలు ఈ నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. గాంధీభవన్ మెట్లెక్కనని ఒకరు.. రాజీనామా చేస్తున్నానని మరొకరు.. కాంగ్రెస్ ఇక టీటీడీపీగా మారుతుందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రెండున్నరేళ్ల పాటు నిర్ణయాన్ని నాన్చిన హైకమాండ్…

Read More

వెంటిలేటర్‌పై టీ-కాంగ్రెస్!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నియామక ప్రక్రియ ఈ వారం మరోమారు వార్తలలో నిలిచింది. రెండు మూడు రోజులలోనే కొత్త చీఫ్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందన్న సమాచారం మీడియాకు అందింది. యథాప్రకారం ఆ పదవిని ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ తదితర నేతలు ఢిల్లీ చేరారు. మరోవైపు ఫలానా నేతకు అవకాశమిస్తే బాగుండదని ఒకరు, నాకే ఇవ్వబోతున్నారని ఒకరు, బయట పార్టీ నుంచి వచ్చినవారికి ఎలా ఇస్తారంటూ ఒకరు, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More

మోడీ వాంట్స్ తెలంగాణ!

తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…

Read More

థర్డ్ వేవ్‌కు సిద్ధమేనా?

సెకండ్ వేవ్ కరోనా కేసులతో దేశం విలవిలలాడుతున్నది. ఫస్ట్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో సెకండ్ వేవ్ తలుపులు తట్టింది. మహారాష్ట్రలో మొదలై రాజధాని ఢిల్లీని చుట్టుముట్టి అతివేగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. ఫస్ట్ వేవ్ కొనసాగిన సంవత్సర కాలంలో(2020 మార్చ్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 9 వరకు) దేశవ్యాప్తంగా కోటి ఎనిమిది లక్షల పైచిలుకు కేసులు, లక్షా 55 వేలకు పైగా మరణాలు నమోదు కాగా,…

Read More

కొత్త ప్రాంతీయ పార్టీకి స్పేస్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో…

Read More

ఉద్యమాలకు, రాజకీయాలకు సంబంధం లేదా?

ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యమబంధాలు లేవని, కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయని అన్నారు. 2014 వరకే ఉద్యమమని, ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని వివరించారు. స్వయానా సీఎం కేసీఆర్ కూడా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా నొక్కి చెప్పారు. గొప్ప ఉద్యమం చేసిన టీఆర్ఎస్ తన ప్రత్యేక…

Read More

స్వార్థం.. ఉద్యమాలపై అస్త్రం..

(2013లో రాసిన ఈ వ్యాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బాగా వర్తిస్తుంది.) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్‌పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయని భావించే ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడడం, పైగా తన చావుకు అధికారుల మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాయడం సంచలనం సృష్టించింది. 2002 బ్యాచ్‌కు చెందిన శర్మ గతం లో బస్తర్‌లోని దంతేవాడ జిల్లా…

Read More

రాష్ట్రాల హక్కులపై ‘ఉగ్ర’ కేంద్రం..

టెర్రరిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేసే ఉద్దేశంతో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రాన్ని (ఎన్సీటీసీ) ఏర్పాటుచేస్తూ ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ పర్యవేక్షణలో సర్వస్వతంత్రంగా పనిచేసే ఈ కేంద్రానికి ఉగ్రవాదుల కార్యకలాపాలపై గూఢచర్యం నెరపడంతో పాటు దేశంలో ఎక్కడైనా సోదాలు చేసే, ఎవరినైనా అరెస్టు చేసే అధికారాలను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి, ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని పలువురు విమర్శించారు. ఉగ్రవాద నిర్మూలన పేరుతో రాష్ట్రాల…

Read More

నల్లధనం.. తెల్ల బతుకులు..

భారతీయులకు చెందిన సుమారు రూ. 25 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువ వున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏ పీ సింగ్ వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిలో మన దేశ కుబేరులదే అగ్రస్థానమని కూడా ఆయన తెలిపారు. సింగ్ ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ అంశంపై చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే దేశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతుందని, అగ్రరాజ్యంగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాభాలో…

Read More

ఆధార్ ప్రక్రియ అంతా గందరగోళమే..

పౌరులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులందించే ‘ఆధార్’ ప్రాజెక్టు అనిశ్చితస్థితిలో పడింది. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని టెంబ్లీ గ్రామంలో ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం.. దేశ జనాభాలో కేవలం పది శాతం మందికి కార్డుల జారీ తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది. పార్లమెంటులో కనీస చర్చ లేకుండా 30వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారని కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా పలువురు మేధావులు ప్రారంభంలోనే…

Read More