మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా తెలంగాణ.. నిఘా వర్గాల హై అలర్ట్!

మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్‌జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు….

Read More

మధ్యభారతంలో ఒకేఒక్కడు.. అందరి కళ్లూ మావోయిస్దు నేత దేవ్‌జీ పైనే!

ఒడిషాలోని కందమాల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్@పాక హన్మంతు మరణించాడు. గణేశ్ మృతితో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రకమిటీలో ప్రస్తుతం ఐదుగురే మిగిలారు. గణపతి@ముప్పాళ లక్ష్మణ్‌రావు, సంగ్రామ్@మల్లా రాజిరెడ్డి, దేవ్‌జీ@తిప్పిరి తిరుపతి తెలంగాణ వాళ్లు కాగా, సాగర్@మిసిర్ బెస్రా, ఆనల్ దా@పతీరాం మాంఝీ బిహార్, జార్ఖండ్‌కు చెందిన వాళ్లు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కార్యదర్శి బసవరాజు@నంబళ్ల కేశవరావు, మిలిటరీ చీఫ్ హిడ్మా సహా…

Read More

టైగర్ల ఓటమిపై సమగ్ర సమీక్ష.. అన్వయించడంలో మావోయిస్టులు ఫెయిల్!

ప్రత్యేక తమిళ ఈలం(తమిళ దేశం) కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఎల్టీటీఈ 2009 మేలో అంతిమ ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీలంక ఉత్తర, పూర్వ తమిళ ప్రాంతాల్లోని మెజారిటీ భూభాగాన్ని ఏళ్ల తరబడి తన కంట్రోలులో ఉంచుకుని, పాలన చేపట్టి, వాయు, నౌకాబలగాలు సహా 40వేలకు మించిన రెగ్యులర్ సైన్యాన్ని కలిగిన ఎల్టీటీఈ.. స్థావరయుద్ధంలో ఇరుక్కుపోయి చివరకు ఘోర ఓటమిని చవిచూసింది. క్రమక్రమంగా శ్రీలంక సైన్యాలు తమ భూభాగాన్ని చుట్టుముడుతున్నాయని, తమ ఏరియా కుంచించుకుపోతున్నదని తెలిసినా,…

Read More

‘అంతరంగ’ మథనం – అన్నవరం దేవేందర్ పుస్తక సమీక్ష

సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా, నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి. ఒక ఆర్టికల్‌కి మరొక ఆర్టికల్‌కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండును ఒలిచి పెట్టినట్లుగా పాఠకులకు చెప్పడం అన్నకు కొట్టిన పిండి. తెలంగాణ మట్టి వాసన మరువని, మూలాలను వదులుకోని, పదవులకు అమ్ముడుపోని హృదయాంతరంగాన్ని స్వచ్ఛంగా తనలో నిలుపుకున్నారు కాబట్టే స్వేచ్ఛగా, నిర్భీతిగా, సహజాతి సహజంగా…

Read More

దిశ@4: మీడియా ప్రజాస్వామీకరణ

దిశ లాంటి పేపర్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుంది?.. తెలంగాణ మీడియా సర్కిళ్లలో ఈ మాట కొంతకాలంగా తరచూ వినిపిస్తున్నది. సాధారణ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో వచ్చిన దిశ నాలుగేళ్లలోనే సూపర్ సక్సెస్ కావడం వాళ్లనలా మాట్లాడిస్తున్నది. అప్పటిదాకా ఒక ప్రధాన స్రవంతి దినపత్రిక పెట్టాలంటే పదుల, వందల కోట్లలో పెట్టుబడి అవసరం అయ్యేది. నెలవారీ ఖర్చుల కోసం ప్రభుత్వ ప్రకటనల పైనా, పార్టీల ప్యాకేజీల పైనా ఆధారపడాల్సివచ్చేది. వార్తలపై అనివార్యంగా గుత్తాధిపత్యం కొనసాగేది. ఏ వార్త రావాలి…..

Read More

ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి విజయాన్ని గ్యారంటీ చేసే అస్త్రాలేమీ లేవని, అబ్బురపరిచే కొత్త స్కీంలు తెద్దామన్నా ఖజానా ఖాళీగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారని చెబుతున్నారు….

Read More

నోటి దూల ఆ పార్టీ నేతల జన్మహక్కు!

‘‘అధికారమివ్వడం ప్రజల వంతు.. వచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడం కాంగ్రెస్ నేతల వంతు’’ అన్నది పాత సామెత. ‘‘నోటి దుల నేతల వంతు.. ఓడించడం ప్రజల వంతు’’ అనేది కొత్త సామెత. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తప్పదని, సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కలువక తప్పదని ఆయన చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అలా అనలేదని, తన మాటలను…

Read More

బీ టీంలే బీజేపీని గెలిపిస్తున్నాయా?

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) నేత అతిషీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాల్లోనూ బరిలో దిగుతామని, మార్చ్ మొదటివారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అమలుచేస్తున్న పథకాలను కర్ణాటకలో కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. పార్టీ కర్ణాటక అధ్యక్షుడు పృథ్వీరెడ్డి కూడా ఇదే విషయాన్ని అనేక సభల్లో ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్)ల పట్ల…

Read More

కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరు సాధ్యమా?

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ సభకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. బీజేపీపై కేసీఆర్…

Read More

డిజిటల్ దిశగా ప్రింట్ మీడియా?

కేవలం మూడేళ్లు కూడా నిండని ‘దిశ’ దినపత్రిక డిజిటల్ ప్లాట్ ఫాంపై సక్సెస్ కావడం దినపత్రికల రంగంలో పెను సంచలనం రేపింది. ప్రింట్ మీడియా విశ్వసనీయతతో సోషల్ మీడియా వేగంతో వార్తలను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ‘దిశ’ ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు దీటుగా, చాలాసార్లు ముందుంటూ దూసుకుపోతోంది. ‘దిశ’ను శత్రువుగా భావించేవాళ్లు సైతం ఒప్పుకుంటున్న రీతిలో మూలమూలనా విస్తరిస్తోంది. ‘దిశ’ గురించి, ‘దిశ’ డైనమిక్ ఎడిషన్ల గురించి తెలియని పల్లె, ‘దిశ’ న్యూస్…

Read More