D.Markandeya

Markandeya Dudam trained in Andhrajyothy as journalism student. Worked in it for 8 years as Edition In charge and City Bureau Chief. Later Worked in Namasthe Telangana for 8 years as News Network In charge. Now working in Disha News Website from 2019 September as it's Editor.

జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు గడ్చిరోలి మహిళా నేత నటాషా మృతి

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ( డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ) సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్‌తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ ఈ వారంలో జరిగిన రెండవ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీభాగ్…

Read More
Marokonam Markandeya

మరోకోణం : మావోయిస్టుల ఓటమి.. సైనిక విశ్లేషణ

మావోయిస్టులు పరాజయం పొందడం వెనకాల ఉన్న ప్రధాన కారణాలను గత వారం రాశాను. ఈ వారం ఆ ఓటమిని సైనికంగా విశ్లేషిస్తాను. గత వారం పొందిన అనుభవం దృష్ట్యా.. ఈ సైనిక సమీక్ష రాయడానికి నాకున్న అర్హతలను పాఠకులకు చెప్పడం బాధ్యతగా భావిస్తాను. పూర్తికాలం కార్యకర్తగా 1983లో పార్టీలో చేరి 1988 నుంచి మిలిటరీ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నాను. ఆ సంవత్సరమే ప్రారంభమైన ‘‘జంగ్’’ మిలిటరీ పత్రికలో పనిచేశాను. 1989 మిలిటరీ క్యాంపులో శిక్షణ పొందిన అనంతరం…

Read More

దిశ ఎడిటర్ మార్కండేయపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడి.. ఆయన జవాబు..

మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను రాజకీయ విశ్లేషణ రాసిన తర్వాత నా పైన కొందరు అప్రజాస్వామికంగా దాడి చేస్తున్నారు. వారు ప్రజాస్వామికంగా నేను రాసిన విషయాలను విభేదిస్తూ, విమర్శిస్తూ ఏమైనా రాసుకోవచ్చు. కాని నా పైన వ్యక్తిగత దాడి చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. నేను పార్టీలోకి వెళ్లిందీ, తిరిగివచ్చిందీ ఏ పరిస్థితుల్లో అనే వివరాలు నేను రాసిన సంపాదకీయాల(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో వచ్చాయి.) సంపుటి మలుపు పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ’’మరోకోణం‘‘ అనే పుస్తకంలో…

Read More
Marokonam Analysis

మరోకోణం: మావోయిస్టుల ఓటమి.. రాజకీయ విశ్లేషణ

ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాజకీయంగా, సైనికంగా పొందిన ఓటమి గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు, సిద్ధాంతీకరణలు కొనసాగుతున్నాయి. ఈ దెబ్బతో భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా నడుస్తున్న మావోయిస్టు ఉద్యమాల చరిత్ర ఇక అంతమైనట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో విప్లవోద్యమాలను ఆశించడం ఎండమావి లాంటిదేనంటున్నారు. ఒకప్పుడు మనిషి జీవితం సమాజం చుట్టూతా తిరిగితే ఇప్పటి తరం తన చుట్టూ తానే అల్లుకుని బతుకుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తను బాగుంటే చాలని, చుట్టుపక్కల మనుషులు…

Read More

దేవ్‌జీ, సోనూ వర్గాలు ఏకమవుతాయా?

(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక…

Read More

మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగిపోతారా?

(దూడం మార్కండేయ) ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కాని ఆ సుప్రీం జాడే లేదు. కొండపల్లి…

Read More

జైళ్లలో ఉన్న మావోయిస్టులకూ లొంగుబాటు ఆఫర్.. అతి త్వరలో ప్రకటన..

అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ వర్గాలు పేర్కొన్నాయి. జైళ్లలో వందలాది మావోయిస్టులు.. బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్,…

Read More

నక్సలైట్ నేతగా నేషనల్ మీడియాతో నా ఇంటర్వ్యూ..

జర్నలిజంలోకి ప్రవేశించక ముందు నేను విప్లవోద్యమంలో పనిచేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణ, కర్నాటక, దండకారణ్య(డీకే) ప్రాంతాల్లో వివిధ రంగాల్లో 17 ఏళ్లు పనిచేసి కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా బయటకు వచ్చాను. జర్నలిజంలో పీజీ చేసి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాను. ప్రస్తుతం దిశ దినపత్రిక ఎడిటర్‌గా ఉన్నాను. 1998లో నేను డీకేలో ఉన్నప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పార్టీ తరఫున నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాను….

Read More
Marokonam

తాజా వార్తలు.. ఎప్పటికప్పుడు.. (పగలు 2.30 గం. సోమవారం, 31 డిసెంబర్ 2024)

TG High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా.. 4 గంటలకల్లా తేలిపోనున్న కేటీఆర్ ఫ్యూచర్ INTER STUDENTS: ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి ఉచిత భోజనం NEW YEAR ALERT: కొత్త సంవత్సరం వేడుకలను..ఇంట్లోనే జరుకోండి : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ CM CHANDRABABU: గత ప్రభుత్వ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు: ఏపీ సీఎం చంద్రబాబు నాకు హైకమాండ్ ఎవరు లేరు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు పేదరికం…

Read More

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీలుగా షిండే, పవార్

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ నిర్ణయించింది. ఆయనకు డిప్యూటీలుగా ఏకనాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఉంటారు. ఈ మేరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ బుధవారం జరిగిన సమావేశంలో ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారం రేపు (గురువారం) జరుగుతుంది.

Read More