జనాభా లెక్కలు- అపోహలు.. నిజాలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నివేదికలో పొందుపర్చారు. నివాసగృహాల సంఖ్యతో పాటు వాటికి సమకూరివున్న సదుపాయాలు, జనాభా పెరుగుదల రేటు, లింగ నిష్పత్తి, అక్షరాస్యత, జననాల-మరణాల రేటు, సగటు జీవితకాలం, ఎస్‌సీ, ఎస్‌టీలు, మతాల వారీగా జనాభా, పట్టణీకరణ తదితర అనేక వివరాలు ఇందులో ఉన్నాయి. నివేదిక ప్రకారం 2011 మార్చ్ 1 నాటికి దేశ జనాభా…

Read More

మల్లోజుల, ఆశన్న ఆధ్వర్యంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ.. ఏర్పడేది అప్పుడే!

మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో ఒక కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నది. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పని చేయనున్నది. ఒక జాతీయ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశన్న ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ‘‘మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్‌లోనే ఉంటారా? లేక స్వస్థలం వరంగల్ వెళతారా? అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ‘‘ప్రజల కోసం…

Read More

తెలంగాణలోనే మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ? పోలీసులు ఏం చెబుతున్నారు?

మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా, మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్‌జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు…

Read More

అబూజ్‌మాడ్‌పై త్వరలో సైనిక దాడి..?

(డి మార్కండేయ) మావోయిస్టులు గెరిల్లా స్థావరంగా ప్రకటించుకున్న అబూజ్మడ్ ప్రాంతంపై త్వరలో భారీ ఎత్తున సైనిక దాడి జరగనుందని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న కేంద్ర బలగాలకు తోడు మరిన్ని బలగాలను పంపించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు యూపీఏ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకూ ఎలాంటి సర్వే జరగని ఈ అబూజ్మడ్ కొండల ప్రాంతాన్ని…

Read More

హుజూరాబాద్‌లో చివరకు నోటుదే విజయమా?

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రధాన పార్టీలు తమ యుద్ధ మోహరింపులను పూర్తి చేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో దిగగా, అధికార పార్టీ తరఫున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. మరో 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా అందరి దృష్టీ రెండు పార్టీల పైనే ఉంది. కాంగ్రెస్ బరిలో ఉన్నా…

Read More

అక్కడ పగలు టీఆర్ఎస్.. రాత్రి బీజేపీ!

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ కాకుండా 15మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దసంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుండగా, ఉపసంహరణకు గడువు ఈ నెల 13 వరకూ ఉంది. చివరకు బరిలో ఎంతమంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యనే…

Read More

మరో బహుజన పార్టీ అవసరమా?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ఈ వారం వార్తల్లో నిలిచింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన అకస్మాత్తుగా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం, 24 గంటల్లోపే ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి విధుల నుంచి రిలీవ్ చేయడం అధికార, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆయన భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. సీఎం కేసీఆర్‌తో ఒక అవగాహనకు వచ్చి తన పదవికి గుడ్‌బై చెప్పారని, రాబోయే హుజూరాబాద్…

Read More

అన్నల రాజ్యం-6: మావోయిస్టు ప్రాంతాలపై త్వరలో భారీ దాడి?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) బస్తర్‌లో రాజ్యమేలుతున్న జనతన సర్కార్లను, మావోయిస్టు గెరిల్లాల ప్రాబల్యాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచ్చలవిడిగా హింసకు పాల్పడడం, హెలికాఫ్టర్లపై సైతం తెగబడడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తే తప్ప దేశాభివృద్ధి సాధ్యం కాదని, మధ్యభారతంలో వివిధ బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలు అమలు చేయడం కుదరదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదేపదే ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. దండకారణ్యం, ఆంధ్రా-ఒరిస్సా, జార్ఖండ్-బెంగాల్,…

Read More

ప్రాంతీయమే ప్రత్యామ్నాయమా?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విషయాన్ని స్పష్టంగా తేల్చేశాయి. ఇప్పటిదాకా ఒక జాతీయ పార్టీగా, దేశ ప్రజల ఎదుట భారతీయ జనతా పార్టీకి కనీస ప్రత్యామ్నాయంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో ఆ అర్హతను కోల్పోయింది. పవర్‌లో ఉన్న పంజాబ్‌తోపాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ఆ పార్టీ ఘోరంగా బొక్క బోర్లా పడింది. ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక దృష్టి కేంద్రీకరించినా యూపీలో కేవలం…

Read More

పౌరుల ఇంటర్‌నెట్‌పై కన్నేసిన ప్రభుత్వం..

పౌరుల ఇంటర్ నెట్ కార్యకలాపాలపై సర్కారు కన్నుపడింది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే నెపంతో ఆది త్వరలో మెయిళ్లపై, బ్లాగులపై, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై, నెట్ ద్వారా జరిపే సంభాషణలపై అస్త్రం సంధించబోతోంది. ఈ మాధ్యమం ద్వారా వెళ్లే టెక్స్ట్ మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలను ఇకనుంచి నిఘా సంస్థలు కనిపెట్టి ఉంచుతాయి. నేత్ర పేరుతో అమలయ్యే ఈ ప్రాజెక్టును ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో, కేబినెట్ సెక్రెటేరియట్లు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఓకే చెప్పాయి….

Read More