హుజూరాబాద్ ఓటెవరికి!?

రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వరకు నామినేషన్లకు గడువు ఉండగా, 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఫలితంగా జరుగుతున్న ఈ ఉపఎన్నిక అటు సీఎం కేసీఆర్‌కు, ఇటు బీజేపీలో చేరిన ఈటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పక్కా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్, ఆయన తనంతట…

Read More

ఆర్టీసీ ఒక్కటే ఎందుకు? ప్రభుత్వాన్నే అమ్మేయండి!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆస్తులను అమ్మాలని, లీజుకు ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇలా సమకూరిన ఆదాయాన్ని ఇప్పటికే పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి ఉపయోగించాలని, భవిష్యత్తులో నష్టాల నివారణకు తక్షణం బస్సు చార్జీలు పెంచాలని కూడా ఆర్టీసీ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయని కొత్తగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. మూడు నాలుగు…

Read More

ఎంఐఎం.. బీజేపీకి బీ టీమ్?

వచ్చే ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆ మధ్యన ప్రకటించారు. భాగీదారీ సంకల్ప్ మోర్చాతో ఈ మేరకు ఎన్నికల ఒప్పందం కుదిరిందని, మరే పార్టీతోనూ పొత్తు ఉండబోదని ప్రకటించారు. బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని, అధికార పీఠాన్ని ప్రభావితం చేయగలిగే సంఖ్యలో సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. ఏళ్లుగా కేవలం తెలంగాణ, అదీ హైదరాబాద్…

Read More

కేసీఆర్ ఢిల్లీ వ్యూహాలు ఫలించేనా!

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఈ వారం వార్తల్లో నిలిచింది. ఈ నెల 1న వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. విభజన సమస్యలు, జలవివాదాలు, రాష్ట్రాభివృద్ధికి నిధులు సహా పలు అంశాలను ఆయన వారితో చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. కాగా, కేసీఆర్-మోడీల భేటీ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన నాలుగు శాసనసభ…

Read More

కమ్యూనిస్టులు కనుమరుగేనా!

తెలంగాణ అంటేనే బయటి ప్రపంచానికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు గుర్తొస్తారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మేం తెలంగాణ నుంచి వచ్చామని చెప్తే, కాస్త అనుమానపు చూపులు చూడడం చాలా మందికి అనుభవమే. మనది పోరాటగడ్డ అని, జనాలలో తిరుగుబాటు మనస్తత్వం ఉంటుందని భావించడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 1946-51 మధ్య ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేతృత్వంలో కొనసాగిన రైతాంగ సాయుధపోరాటం చరిత్ర పుటలలో నిలిచిపోయింది. వేలాది రైతాంగ గెరిల్లాలు ఆయుధాలు చేబూని 41 వేల చ.కి.మీ….

Read More

రేవంత్‌రెడ్డి టార్గెట్ 2023 ఇదే!

2018 ప్రారంభంలో నాకు తెలిసిన ఓ మేధావి మిత్రుడు రేవంత్‌రెడ్డిని కలిసారు. అప్పటికి ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మూడు, నాలుగు నెలలవుతోంది. ఆయనకు పీసీసీ సారథ్య బాధ్యతలు ఇస్తారని, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం అభ్యర్థి అని తెలుగు మీడియా కోడై కూస్తున్నది. అదే విషయాన్ని నా మిత్రుడు ప్రస్తావిస్తే, ప్రస్తుతం తన టైం రాలేదని, చేయాల్సిన పనులు చాలా మిగిలివున్నాయని అన్నారట. హైకమాండ్ వెంటనే తనకు ఆ పదవి ఇచ్చినా తీసుకోవడం…

Read More

కేసీఆర్ మదిలో మధ్యంతర ఎన్నికలు?

రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. లెక్క ప్రకారం 2023 డిసెంబర్ వరకూ ప్రస్తుత శాసనసభ కాలం ఉన్నా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. దళితులను ఆకట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించడానికే అంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన చేసిన ప్రసంగం వింటే త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. దళితబంధును రాష్ట్రమంతా పకడ్బందీగా అమలుచేస్తామని, దళితవాడల్లో అన్ని…

Read More

అందరిబంధు, పేదలబంధు రావాలి!

రాష్ట్రంలో ఇప్పుడంతా దళితబంధు పైనే చర్చ నడుస్తోంది. హుజూరాబాద్‌లో జరగనున్న ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తెచ్చారని, ఈటలను ఓడించడం కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారని అంటున్నారు. ఈ పథకం మూలంగా  ఆ నియోజకవర్గంలోని 45వేల పైచిలుకు ఎస్సీ ఓట్లలో కనీసం 80శాతం టీఆర్ఎస్ ఖాతాలో పడడం ఖాయమనే అభిప్రాయం వినవస్తోంది. ఈ ఎత్తుగడ వికటించే అవకాశమూ ఉందని, కేవలం దళితులకే లబ్ధి చేకూర్చడం వల్ల దళితేతర వర్గాలు ఆ పార్టీకి…

Read More

మరో బహుజన పార్టీ అవసరమా?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ఈ వారం వార్తల్లో నిలిచింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన అకస్మాత్తుగా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం, 24 గంటల్లోపే ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి విధుల నుంచి రిలీవ్ చేయడం అధికార, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆయన భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. సీఎం కేసీఆర్‌తో ఒక అవగాహనకు వచ్చి తన పదవికి గుడ్‌బై చెప్పారని, రాబోయే హుజూరాబాద్…

Read More

హుజూరాబాద్.. మినీ 2023?

ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును కేసీఆర్ రంగంలోకి దించారు. సిద్దిపేట సమీపంలోని రంగనాయక్‌సాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా ‘ఆపరేషన్ హుజూరాబాద్’ కొనసాగుతున్నది. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, వీరవిధేయుడు ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో పల్లెపల్లెనా ఈటల వ్యతిరేక ప్రచారం కొనసాగుతున్నది. ఇప్పటికే మండలానికో మంత్రిని లేదా ఎమ్మెల్యేను, గ్రామానికో నేతను అన్నట్టుగా ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి యాభై లేదా వంద మంది ఓటర్లకు ఒక పోల్ మేనేజ్‌మెంట్ పర్సన్‌ను కేటాయించాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడవద్దని…

Read More