అన్నల రాజ్యం-4: ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లింది ఇలా..!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మా ఛత్తీస్గఢ్ పర్యటన ఎంతో ఉద్వేగభరితంగా ఆరు రోజులు సాగింది. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనుల మధ్య ఇరుకు గదుల్లో ఫోన్లతో మాట్లాడుతూ టీవీలతో సావాసం చేస్తూ ఫేస్బుక్కుల్లో పలకరిస్తూ తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో రేపటి గురించిన ఆందోళనతో బతికే మాకు ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల జనతన సర్కారు చెక్పోస్టు దాటగానే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపించింది. అక్కడ సమష్టి తత్వం సర్వవ్యాపితం. బతుకైనా, చావైనా, పండుగైనా, పోరాటమైనా అన్నీ కలిసే….

Read More

పల్లెకు పోదాం చలో చలో..

మూడు రోజుల కిందట మా ఆఫీసు కొలీగ్స్ మధ్య ఓ చర్చ జరిగింది. ” సెకండ్ వేవ్ ఇంకా పోనే లేదు. థర్డ్ వేవ్ అంటున్నరు. మధ్యలో ఈ రంగు రంగుల ఫంగస్ గొడవ ఒకటి. అది కూడా మహమ్మారిలా మారి లక్షల మందిని చంపవచ్చునన్న వార్త ఇంకొకటి. ఇట్లైతే ఇంక బతుకుడెట్ల” అన్నది ఆ చర్చ సారాంశం. ”ఈ సిటీల ఇట్ల ఉండుడు కంటే మన సొంతూళ్లకు వెళ్లిపోయి, ఓ ఏడాది గ్రాసం సమకూర్చుకుని బయటకు…

Read More

మునుగోడులో బీజేపీ ఓడింది.. మోడీ-షా గెలిచారు!

మునుగోడులో 10వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడం ఆ పార్టీకి గొప్ప ఊరటగా భావించవచ్చు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలగి, పదవికి రాజీనామా చేసిన ఫలితంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ తమ బలగాలను భారీగా మోహరించాయి. అర్థ, అంగ బలాలను విచ్ఛలవిడిగా వినియోగించాయి. ఓటుకు రూ. 3నుంచి 5వేల వరకు వెచ్చించాయి. టీఆర్ఎస్ వంద మంది వరకు మంత్రులు,…

Read More

పతనం అంచున అస్సద్!

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే పచ్చి నియంతనైనా గొప్ప ప్రజాస్వామికవాదిగా, నచ్చకపోతే ప్రజాదరణ గల నేతను కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ముద్రవేసే అగ్రరాజ్యానికి ఇప్పుడు సిరియా పాలకుడు హఫెజ్ అల్ అస్సద్‌పై కోపమొచ్చింది. అంతే.. ఆ దేశం ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోయినట్టు అమెరికాకు కనిపించింది. ఇరాక్, లెబనాన్ తదితర దేశాల్లో అనర్థాలకు ఆ దేశమే మూలమైంది. అక్కడ మానవ హక్కుల…

Read More

హుజూరాబాద్ ఓటెవరికి!?

రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వరకు నామినేషన్లకు గడువు ఉండగా, 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఫలితంగా జరుగుతున్న ఈ ఉపఎన్నిక అటు సీఎం కేసీఆర్‌కు, ఇటు బీజేపీలో చేరిన ఈటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పక్కా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్, ఆయన తనంతట…

Read More

ప్రణబ్ చిలుక పలుకులు..

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపాత్రునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రమాణం పూర్తయిన వెంటనే ఆయన చేసిన తొలి ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పేదల ఆకాంక్షలను ధనికుల సిద్ధాంతాలు పరిష్కరించలేవంటూ ఆయన చెప్పిన నీతి వాక్యాలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఆధునిక దేశ నిర్మాణంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఆర్థిక సమానత్వమని, పేదరికమనేది భారత నిఘంటువులో ఉండాల్సిన పదం కాదని, ఆకలి కంటే…

Read More

కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరు సాధ్యమా?

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ సభకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. బీజేపీపై కేసీఆర్…

Read More

టి-కాంగ్రెస్ కథ కంచికేనా!

ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడుతుందని, దినదినం పుంజుకుంటున్న కమలనాథులను వెనక్కి నెట్టేసి టీఆర్ఎస్ పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతుందని చాలా మంది ఆశించారు. ఆయన అధ్యక్షుడైన కొత్తలో రాజకీయ వాతావరణం అలాగే కనిపించింది. ప్రతి నిత్యం రేవంత్ ఇంటికి వేలాది మంది చేరుకోవడం, కాబోయే సీఎం అంటూ నినదించడం, కాస్త లేట్‌గా అయినా సీనియర్లు దారికి రావడం, తామంతా కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తామని ప్రకటించడం.. పార్టీ శ్రేణుల్లో…

Read More

పోస్కోపై మూలవాసుల పోరాటం

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్కో వ్యతిరేక పోరాటం ప్రముఖమైనది. రూ. 60 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఏటా 12 మిలియన్ టన్నుల స్టీలును ఉత్పత్తి చేయడం లక్ష్యం గా భారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి పోస్కో కంపెనీ ఒరిస్సా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు స్థానికులు అత్యంత దృఢమైన, రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారు. జగత్సంగ్పూర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలకు చెందిన సుమారు…

Read More

అన్నలరాజ్యం-3: విముక్తి ప్రాంతాలు ఏర్పాటుచేస్తారా?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) ఎమర్జెన్సీ తదనంతరం కేంద్ర ఆర్గనైజర్ల రూపంలో రైతాంగాన్ని, యువతీ యువకులను ప్రజాసంగాల్లోకి సమీకరించిన నక్సలైట్లు ఆ తర్వాత క్రమంగా తమ నిర్మాణాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకున్నారు. భూస్వాముల, గూండాల దాడుల నుంచి రక్షణ కోసం ఒక ఆర్గనైజర్, ఇద్దరు సభ్యుల (1+2) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఆ సభ్యుల వద్ద తపంచాలు, నాటుబాంబులు ఉండేవి. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలపై సైతం దాడి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 1985 నుంచి ఐదుగురి…

Read More