కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలకమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో…

Read More

కేసీఆర్ సార్.. మీరు మారాలి!

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ మొదలైంది. బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఊరూరా అభివృద్ధి పనులు చేపట్టినా, పెండింగులో ఉన్న బిల్లులన్నీ మంజూరు చేసినా, చివరకు ఓటు వేసే ప్రతి వ్యక్తికీ రూ. ఆరు వేల నగదు ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి 23,855 ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రతిష్టకు అవమానకర భంగపాటు అని, ఇక రాష్ట్రంలో కమలనాథులదే…

Read More

గెలుపు కోసం కేసీఆర్ త్రిముఖ వ్యూహం..

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్@పీకే టీం సర్వే నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా లేని నియోజకవర్గాలలో నష్టనివారణ చర్యలు చేబడుతున్నారు.40 మంది వరకు…

Read More

ఆ సంతోషాలు మనకెప్పుడు..?

ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున్న సమితి తొలిసారిగా ఆయా దేశాల్లో ప్రజలు ఏ మేర కు సంతోషంగా ఉన్నారనే కోణంలో సర్వేలు నిర్వహించింది. అభివృద్ధితో నిమిత్తం లేకుండా ఆయా దేశాల పౌరులు ఏ మేరకు ఆనందంగా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. 2006 నుంచి 2011 మధ్యకాలంలో జరిగిన ఈ సర్వే ఫలితాలపై ఆధారపడి వివిధ దేశాలకు ఈ సంతోష సూచికలో…

Read More

నక్సల్స్ పై ‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో ప్రయోగాత్మక పరీక్షలు చేసింది. దంతేవాడ జిల్లా చింతల్‌నార్‌లో మావోయిస్టులు చేసిన దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో మొదటిసారి 2010 ఏప్రిల్ 14న అమెరికా తయారీ టీ-హెచ్‌ఎంఏవీ రకం మానవ రహిత విమానాన్ని బస్తర్ అడవుల మీదుగా గంట ల పాటు తిప్పారు. విమానం పంపిన చిత్రాలు, వీడియో ఫుటేజీ ఆధారంగా మావోయిస్టుల…

Read More

కేసీఆర్ ఢిల్లీ వ్యూహాలు ఫలించేనా!

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఈ వారం వార్తల్లో నిలిచింది. ఈ నెల 1న వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. విభజన సమస్యలు, జలవివాదాలు, రాష్ట్రాభివృద్ధికి నిధులు సహా పలు అంశాలను ఆయన వారితో చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. కాగా, కేసీఆర్-మోడీల భేటీ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన నాలుగు శాసనసభ…

Read More

దిశ@4: మీడియా ప్రజాస్వామీకరణ

దిశ లాంటి పేపర్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుంది?.. తెలంగాణ మీడియా సర్కిళ్లలో ఈ మాట కొంతకాలంగా తరచూ వినిపిస్తున్నది. సాధారణ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో వచ్చిన దిశ నాలుగేళ్లలోనే సూపర్ సక్సెస్ కావడం వాళ్లనలా మాట్లాడిస్తున్నది. అప్పటిదాకా ఒక ప్రధాన స్రవంతి దినపత్రిక పెట్టాలంటే పదుల, వందల కోట్లలో పెట్టుబడి అవసరం అయ్యేది. నెలవారీ ఖర్చుల కోసం ప్రభుత్వ ప్రకటనల పైనా, పార్టీల ప్యాకేజీల పైనా ఆధారపడాల్సివచ్చేది. వార్తలపై అనివార్యంగా గుత్తాధిపత్యం కొనసాగేది. ఏ వార్త రావాలి…..

Read More

పల్లెకు పోదాం చలో చలో..

మూడు రోజుల కిందట మా ఆఫీసు కొలీగ్స్ మధ్య ఓ చర్చ జరిగింది. ” సెకండ్ వేవ్ ఇంకా పోనే లేదు. థర్డ్ వేవ్ అంటున్నరు. మధ్యలో ఈ రంగు రంగుల ఫంగస్ గొడవ ఒకటి. అది కూడా మహమ్మారిలా మారి లక్షల మందిని చంపవచ్చునన్న వార్త ఇంకొకటి. ఇట్లైతే ఇంక బతుకుడెట్ల” అన్నది ఆ చర్చ సారాంశం. ”ఈ సిటీల ఇట్ల ఉండుడు కంటే మన సొంతూళ్లకు వెళ్లిపోయి, ఓ ఏడాది గ్రాసం సమకూర్చుకుని బయటకు…

Read More
Marokonam

చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?

వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలోని పరిమిత స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో జనసేన బలంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటుబ్యాంకు ఏర్పడిందని చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదని, ఇతర పార్టీల గెలుపోటములను మాత్రం ప్రభావితం చేయగలమని స్పష్టం చేశారు.పవన్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పార్టీల ప్రభావంపై మరోమారు చర్చ ఊపందుకుంది. జనసేనతో పాటు…

Read More

ఆహారం భద్రమేనా!

ఆహార భద్రత బిల్లును అమలులోకి తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం యుద్ధవూపాతిపదికన చర్యలు చేపట్టింది. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును చర్చకు పెట్టే వీలు కుదరకపోవడంతో కేంద్ర కేబినెట్ హడావుడిగా గత బుధవారం ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించి సంతకం కోసం రాష్ట్రపతికి పంపించింది.శుక్రవారం రాజ్యాంగ అధినేత అయిన ప్రణబ్ ఆమోదముద్ర కూడా వేశారు. సోనియాగాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ బిల్లు భారత పౌరుల్లో మూడింట రెండు వంతుల జనాభాకు ఆహార భద్రతను కల్పిస్తుంది. జీవించడానికి అవసరమైన…

Read More