ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి విజయాన్ని గ్యారంటీ చేసే అస్త్రాలేమీ లేవని, అబ్బురపరిచే కొత్త స్కీంలు తెద్దామన్నా ఖజానా ఖాళీగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారని చెబుతున్నారు….

Read More

నోటి దూల ఆ పార్టీ నేతల జన్మహక్కు!

‘‘అధికారమివ్వడం ప్రజల వంతు.. వచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడం కాంగ్రెస్ నేతల వంతు’’ అన్నది పాత సామెత. ‘‘నోటి దుల నేతల వంతు.. ఓడించడం ప్రజల వంతు’’ అనేది కొత్త సామెత. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తప్పదని, సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కలువక తప్పదని ఆయన చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అలా అనలేదని, తన మాటలను…

Read More

కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యమేనా!?

చూడబోతే, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహం సక్సెస్ అయ్యేట్టే కనిపిస్తోంది. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని వీరిద్దరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్'(Congress mukt Bharat) కోసం బహిరంగంగానే పిలుపునిచ్చారు. వారి కృషి ఫలితమా, అన్నట్లుగా 2014లో మొదటి దఫా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హస్తం పార్టీ క్రమంగా బలహీనమవుతూ వస్తున్నది. ఆ యేడు కోల్పోయిన లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష హోదాను ఐదేళ్ల అనంతరం…

Read More

మోడీకి ప్రత్యామ్నాయం లేదా?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ మంచి దూకుడు మీదుంది. ఇప్పటికే రెండు దఫాలుగా పాలన సాగించిన ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన అనేక విమర్శలున్నా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలినా 2019 మే తర్వాత ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధిస్తూనే వుంది. చేజారుతుందని భావించిన ఉత్తరప్రదేశ్‌ 2022లో అనూహ్యంగా భారీ మెజారిటీతో తమ ఖాతాలో పడడం కమలనాథులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో…

Read More

రాహుల్‌జీ.. ముందు పార్టీని చక్కదిద్దండి !

నెహ్రూ కుటుంబ వారసుడు, కాంగ్రెస్ యువనేత, ఎంపీ రాహుల్‌గాంధీ సారథ్యంలో గత బుధవారం ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభమైంది. కుల, మత, ప్రాంత, భాష, ఆహార, ఆహార్య విచక్షణ లేకుండా భారతావనిని ఏకం చేయడమే ఈ యాత్ర లక్ష్యం. కన్యాకుమారిలో మొదలై 12 రాష్ట్రాల గుండా 150 రోజులలో 3570 కి.మీ. ప్రయాణించి జమ్మూలో 2023 ఫిబ్రవరి 3న ముగియనుంది. ప్రతిరోజూ 25కి.మీ. చొప్పున నడవనున్నారు. భారత్ జోడో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ యాత్రలో 52…

Read More

టి-కాంగ్రెస్ కథ కంచికేనా!

ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడుతుందని, దినదినం పుంజుకుంటున్న కమలనాథులను వెనక్కి నెట్టేసి టీఆర్ఎస్ పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతుందని చాలా మంది ఆశించారు. ఆయన అధ్యక్షుడైన కొత్తలో రాజకీయ వాతావరణం అలాగే కనిపించింది. ప్రతి నిత్యం రేవంత్ ఇంటికి వేలాది మంది చేరుకోవడం, కాబోయే సీఎం అంటూ నినదించడం, కాస్త లేట్‌గా అయినా సీనియర్లు దారికి రావడం, తామంతా కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తామని ప్రకటించడం.. పార్టీ శ్రేణుల్లో…

Read More

కమలనాథులా? కాంగ్రెస్సా?

రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ మరోసారి వేడెక్కించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఓ పార్టీ పైన వాడి వేడి విమర్శలు సంధించో, పథకాన్ని ప్రకటించో బాంబులు పేల్చే ఆయన గత నెల నుంచీ భారతీయ జనతా పార్టీపై పడ్డారు. వరుస ప్రెస్ మీట్లలో వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం పైనా, కమలనాథుల పైనా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఖబడ్దార్ బీజేపీ.. దేశంలో అగ్గి పెడతం.. వెంటాడుతాం.. వేటాడుతాం.. మెడలు వంచుడు కాదు.. నీ మెడలు విరుస్తాం…

Read More

కేటీఆర్ టైం వచ్చేసింది!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పల్లెలు, పట్టణాల నుంచి మొదలుకొని రాజధాని వరకు ఆ పార్టీ శ్రేణులలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ముందు కినుక వహించిన నేతలు కూడా చివరకు ప్రమాణస్వీకారానికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణ తల్లి సోనియమ్మేనంటూ రేవంత్ చేసిన ప్రసంగం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఒకరకంగా వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సైరన్ ఊదిన సంకేతాలు…

Read More

వెంటిలేటర్‌పై టీ-కాంగ్రెస్!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నియామక ప్రక్రియ ఈ వారం మరోమారు వార్తలలో నిలిచింది. రెండు మూడు రోజులలోనే కొత్త చీఫ్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందన్న సమాచారం మీడియాకు అందింది. యథాప్రకారం ఆ పదవిని ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ తదితర నేతలు ఢిల్లీ చేరారు. మరోవైపు ఫలానా నేతకు అవకాశమిస్తే బాగుండదని ఒకరు, నాకే ఇవ్వబోతున్నారని ఒకరు, బయట పార్టీ నుంచి వచ్చినవారికి ఎలా ఇస్తారంటూ ఒకరు, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More

నల్లధనం.. తెల్ల బతుకులు..

భారతీయులకు చెందిన సుమారు రూ. 25 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువ వున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏ పీ సింగ్ వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిలో మన దేశ కుబేరులదే అగ్రస్థానమని కూడా ఆయన తెలిపారు. సింగ్ ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ అంశంపై చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే దేశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతుందని, అగ్రరాజ్యంగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాభాలో…

Read More