జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు గడ్చిరోలి మహిళా నేత నటాషా మృతి

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ( డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ) సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్‌తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ ఈ వారంలో జరిగిన రెండవ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీభాగ్…

Read More

దిశ ఎడిటర్ మార్కండేయపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడి.. ఆయన జవాబు..

మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను రాజకీయ విశ్లేషణ రాసిన తర్వాత నా పైన కొందరు అప్రజాస్వామికంగా దాడి చేస్తున్నారు. వారు ప్రజాస్వామికంగా నేను రాసిన విషయాలను విభేదిస్తూ, విమర్శిస్తూ ఏమైనా రాసుకోవచ్చు. కాని నా పైన వ్యక్తిగత దాడి చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. నేను పార్టీలోకి వెళ్లిందీ, తిరిగివచ్చిందీ ఏ పరిస్థితుల్లో అనే వివరాలు నేను రాసిన సంపాదకీయాల(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో వచ్చాయి.) సంపుటి మలుపు పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ’’మరోకోణం‘‘ అనే పుస్తకంలో…

Read More

దేవ్‌జీ, సోనూ వర్గాలు ఏకమవుతాయా?

(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక…

Read More

మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగిపోతారా?

(దూడం మార్కండేయ) ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కాని ఆ సుప్రీం జాడే లేదు. కొండపల్లి…

Read More

జైళ్లలో ఉన్న మావోయిస్టులకూ లొంగుబాటు ఆఫర్.. అతి త్వరలో ప్రకటన..

అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ వర్గాలు పేర్కొన్నాయి. జైళ్లలో వందలాది మావోయిస్టులు.. బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్,…

Read More

మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా తెలంగాణ.. నిఘా వర్గాల హై అలర్ట్!

మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్‌జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు….

Read More

అన్నల రాజ్యం-5: ఇళ్ల దహనాలు ఇక్కడ కామన్..

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్లు ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. కూలీ రేట్లు పెంచాలని, కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు అరికట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు సభలు పెట్టినా, ర్యాలీలు తీసినా, బంద్లు నిర్వహించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. విసిగి వేసారి చివరకు మావోయిస్టుల గైడెన్స్లో స్వయంపాలనకు పూనుకుంటే మాత్రం వెంటనే బలగాలను దించి భయపెట్టే, బలప్రయోగం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు….

Read More

అన్నల రాజ్యం-4: ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లింది ఇలా..!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మా ఛత్తీస్గఢ్ పర్యటన ఎంతో ఉద్వేగభరితంగా ఆరు రోజులు సాగింది. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనుల మధ్య ఇరుకు గదుల్లో ఫోన్లతో మాట్లాడుతూ టీవీలతో సావాసం చేస్తూ ఫేస్బుక్కుల్లో పలకరిస్తూ తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో రేపటి గురించిన ఆందోళనతో బతికే మాకు ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల జనతన సర్కారు చెక్పోస్టు దాటగానే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపించింది. అక్కడ సమష్టి తత్వం సర్వవ్యాపితం. బతుకైనా, చావైనా, పండుగైనా, పోరాటమైనా అన్నీ కలిసే….

Read More

అన్నల రాజ్యం-2: నాలుగు జిల్లాల్లో సమాంతర సర్కార్లు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) కటిక చీకట్లలో కడు పేదరికంతో కూడు, గూడు, గుడ్డ కరువైన దీనస్థితిలో బతుకుతున్న బస్తర్ ఆదివాసులకు 1980లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశించిన నక్సలైట్లు దేవుళ్లలా కనిపించారు. అభివృద్ధి పేరుతో అటవీ సంపదను, ఖనిజ వనరులను దోచుకెళుతున్న ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు చేస్తున్నదేమీ లేదని అన్నలు చెప్పిన మాటలను మొదట వాళ్లు నమ్మలేదు. అయితే కాలక్రమంలో పాలకుల పట్టించుకోనితనం, అటవీ సిబ్బంది అరాచకాలు, కాంట్రాక్టర్ల, షావుకార్ల దోపిడి వారిని మావోయిస్టులకు దగ్గర…

Read More

అన్నల రాజ్యంలో ఆరు రోజులు: బస్తర్‌లో మావోయిస్టు సర్కారు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) మధ్యభారత అడవుల్లో ఓ కొత్త వ్యవస్థ పురుడు పోసుకుంటోంది. దేశ వనరులను బహుళజాతి సంస్థలకు దఖలు పరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై అక్కడి ఆదివాసీలు తిరగబడుతున్నారు. మావ నాటె మావ రాజ్ (మా ఊళ్లో మా ప్రభుత్వం) అనే నినాదంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీ అండతో ఊరూరా క్రాంతికారీ జనతన సర్కార్ల (విప్లవ ప్రజా సమితి)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమిస్తున్నారు. మానవజాతి మనుగడకు,…

Read More