మోడీ.. కేసీఆర్.. ఇచ్చుకో.. పుచ్చుకో!?
గత మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన పద్ధతిని అనుసరించిందని ఆయన దుయ్యబట్టారు. విభజన బిల్లుపై కనీసం చర్చకు అనుమతించలేదని, మైకులు ఆపి, పెప్పర్ స్ర్పేలు కొట్టి ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని సానుభూతిని వ్యక్తం చేశారు. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసివుండచ్చునని అన్నారు. రాష్ట్రపతి…
