మోడీ.. కేసీఆర్.. ఇచ్చుకో.. పుచ్చుకో!?

గత మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన పద్ధతిని అనుసరించిందని ఆయన దుయ్యబట్టారు. విభజన బిల్లుపై కనీసం చర్చకు అనుమతించలేదని, మైకులు ఆపి, పెప్పర్ స్ర్పేలు కొట్టి ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని సానుభూతిని వ్యక్తం చేశారు. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసివుండచ్చునని అన్నారు. రాష్ట్రపతి…

Read More

కేసీఆర్.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!

ఫిబ్రవరి 1న చట్టసభల్లో మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఉద్యమకాలం నుంచీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, వాటిల్లో వాడి వేడి బుల్లెట్లు పేల్చడం, జనాలను మెస్మరైజ్ చేయడం, మీడియా పతాక శీర్షికల్లో నిలవడం కేసీఆర్‌కు అలవాటే అయినప్పటికీ, మొన్నటి పత్రికా సమావేశం మరింత స్పెషల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో కేసీఆర్.. మోడీని, ఆయన నేతృత్వంలో నడుస్తున్న సర్కారును, బీజేపీని, ఆ పార్టీ…

Read More

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13లక్షల మంది వృద్ధులకు, 14లక్షల మంది వితంతువులకు, 1.20లక్షల ఒంటరి మహిళలకు,…

Read More

కమలనాథులా? కాంగ్రెస్సా?

రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ మరోసారి వేడెక్కించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఓ పార్టీ పైన వాడి వేడి విమర్శలు సంధించో, పథకాన్ని ప్రకటించో బాంబులు పేల్చే ఆయన గత నెల నుంచీ భారతీయ జనతా పార్టీపై పడ్డారు. వరుస ప్రెస్ మీట్లలో వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం పైనా, కమలనాథుల పైనా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఖబడ్దార్ బీజేపీ.. దేశంలో అగ్గి పెడతం.. వెంటాడుతాం.. వేటాడుతాం.. మెడలు వంచుడు కాదు.. నీ మెడలు విరుస్తాం…

Read More

కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలకమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో…

Read More

కేసీఆర్ ఢిల్లీ వ్యూహాలు ఫలించేనా!

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఈ వారం వార్తల్లో నిలిచింది. ఈ నెల 1న వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. విభజన సమస్యలు, జలవివాదాలు, రాష్ట్రాభివృద్ధికి నిధులు సహా పలు అంశాలను ఆయన వారితో చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. కాగా, కేసీఆర్-మోడీల భేటీ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన నాలుగు శాసనసభ…

Read More

కేసీఆర్ మదిలో మధ్యంతర ఎన్నికలు?

రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. లెక్క ప్రకారం 2023 డిసెంబర్ వరకూ ప్రస్తుత శాసనసభ కాలం ఉన్నా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. దళితులను ఆకట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించడానికే అంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన చేసిన ప్రసంగం వింటే త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. దళితబంధును రాష్ట్రమంతా పకడ్బందీగా అమలుచేస్తామని, దళితవాడల్లో అన్ని…

Read More

మోడీ వాంట్స్ తెలంగాణ!

తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…

Read More

థర్డ్ వేవ్‌కు సిద్ధమేనా?

సెకండ్ వేవ్ కరోనా కేసులతో దేశం విలవిలలాడుతున్నది. ఫస్ట్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో సెకండ్ వేవ్ తలుపులు తట్టింది. మహారాష్ట్రలో మొదలై రాజధాని ఢిల్లీని చుట్టుముట్టి అతివేగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. ఫస్ట్ వేవ్ కొనసాగిన సంవత్సర కాలంలో(2020 మార్చ్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 9 వరకు) దేశవ్యాప్తంగా కోటి ఎనిమిది లక్షల పైచిలుకు కేసులు, లక్షా 55 వేలకు పైగా మరణాలు నమోదు కాగా,…

Read More

నల్లధనం.. తెల్ల బతుకులు..

భారతీయులకు చెందిన సుమారు రూ. 25 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువ వున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏ పీ సింగ్ వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిలో మన దేశ కుబేరులదే అగ్రస్థానమని కూడా ఆయన తెలిపారు. సింగ్ ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ అంశంపై చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే దేశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతుందని, అగ్రరాజ్యంగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాభాలో…

Read More