చింతలు తీర్చని చింతన్ శిబిర్!

  కష్టాల కడలిలో జీవన్మరణ పోరాటం చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గట్టెక్కే మార్గాలను వెతకడానికి ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌’ నిర్వహించింది. నాయకత్వపరంగా, సంస్థాగతంగా, రాజకీయంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేధోమథనం జరిపింది. చివరిరోజు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పేరిట కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పార్టీ పునరుజ్జీవం కోసం పైనుంచి కింది స్థాయి వరకు సంస్థాగత సంస్కరణలు చేపట్టడానికి ఒక టాస్క్‌‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. రాజకీయ వ్యవహారాలపై…

Read More

2023: కౌన్ బనేగా సీఎం!?

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఏడాదిన్నర కాలమున్నా అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించి ఇప్పటికే తమ భవిష్యత్ బాటను స్పష్టపరచారు. వడ్ల కొనుగోలుపై ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒంటరి చేయ యత్నించారు. మోడీ పట్టించుకోకున్నా తాను పట్టించుకుంటానని రైతులకు సందేశం అందేలా వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఇటీవల పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై ఆధారపడి…

Read More

కేసీఆర్‌లో ఓటమి భయం నిజమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్‌ను సందర్శించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బిహార్‌కు చెందిన పీకే తనవైన వ్యూహాలతో 2012 గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని మోడీని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి మొదటిసారి వార్తల్లో నిలిచారు. ఆ ఊపుతో 2014…

Read More

మోడీ.. కేసీఆర్.. ఇచ్చుకో.. పుచ్చుకో!?

గత మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన పద్ధతిని అనుసరించిందని ఆయన దుయ్యబట్టారు. విభజన బిల్లుపై కనీసం చర్చకు అనుమతించలేదని, మైకులు ఆపి, పెప్పర్ స్ర్పేలు కొట్టి ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని సానుభూతిని వ్యక్తం చేశారు. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసివుండచ్చునని అన్నారు. రాష్ట్రపతి…

Read More

కేసీఆర్.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!

ఫిబ్రవరి 1న చట్టసభల్లో మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఉద్యమకాలం నుంచీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, వాటిల్లో వాడి వేడి బుల్లెట్లు పేల్చడం, జనాలను మెస్మరైజ్ చేయడం, మీడియా పతాక శీర్షికల్లో నిలవడం కేసీఆర్‌కు అలవాటే అయినప్పటికీ, మొన్నటి పత్రికా సమావేశం మరింత స్పెషల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో కేసీఆర్.. మోడీని, ఆయన నేతృత్వంలో నడుస్తున్న సర్కారును, బీజేపీని, ఆ పార్టీ…

Read More

ఓటర్లా..? బిచ్చగాళ్లా..?

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా అనేక మంది అధికార పార్టీ నేతలు తరచూ ప్రకటిస్తుంటారు. ఆ పథకాలపై విపక్షాల, ప్రజాసంఘాల విమర్శలు ఎలా ఉన్నా ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని సంక్షేమ పథకాలు, కేటాయిస్తున్నన్ని నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదనేది కఠోర వాస్తవం. 2021 నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్…

Read More

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13లక్షల మంది వృద్ధులకు, 14లక్షల మంది వితంతువులకు, 1.20లక్షల ఒంటరి మహిళలకు,…

Read More

టి-కాంగ్రెస్ కథ కంచికేనా!

ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడుతుందని, దినదినం పుంజుకుంటున్న కమలనాథులను వెనక్కి నెట్టేసి టీఆర్ఎస్ పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతుందని చాలా మంది ఆశించారు. ఆయన అధ్యక్షుడైన కొత్తలో రాజకీయ వాతావరణం అలాగే కనిపించింది. ప్రతి నిత్యం రేవంత్ ఇంటికి వేలాది మంది చేరుకోవడం, కాబోయే సీఎం అంటూ నినదించడం, కాస్త లేట్‌గా అయినా సీనియర్లు దారికి రావడం, తామంతా కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తామని ప్రకటించడం.. పార్టీ శ్రేణుల్లో…

Read More

కమలనాథులా? కాంగ్రెస్సా?

రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ మరోసారి వేడెక్కించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఓ పార్టీ పైన వాడి వేడి విమర్శలు సంధించో, పథకాన్ని ప్రకటించో బాంబులు పేల్చే ఆయన గత నెల నుంచీ భారతీయ జనతా పార్టీపై పడ్డారు. వరుస ప్రెస్ మీట్లలో వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం పైనా, కమలనాథుల పైనా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఖబడ్దార్ బీజేపీ.. దేశంలో అగ్గి పెడతం.. వెంటాడుతాం.. వేటాడుతాం.. మెడలు వంచుడు కాదు.. నీ మెడలు విరుస్తాం…

Read More

కేసీఆర్ సార్.. మీరు మారాలి!

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ మొదలైంది. బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఊరూరా అభివృద్ధి పనులు చేపట్టినా, పెండింగులో ఉన్న బిల్లులన్నీ మంజూరు చేసినా, చివరకు ఓటు వేసే ప్రతి వ్యక్తికీ రూ. ఆరు వేల నగదు ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి 23,855 ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రతిష్టకు అవమానకర భంగపాటు అని, ఇక రాష్ట్రంలో కమలనాథులదే…

Read More