దేవ్‌జీ, సోనూ వర్గాలు ఏకమవుతాయా?

(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్‌జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక…

Read More

జైళ్లలో ఉన్న మావోయిస్టులకూ లొంగుబాటు ఆఫర్.. అతి త్వరలో ప్రకటన..

అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ వర్గాలు పేర్కొన్నాయి. జైళ్లలో వందలాది మావోయిస్టులు.. బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్,…

Read More

టైగర్ల ఓటమిపై సమగ్ర సమీక్ష.. అన్వయించడంలో మావోయిస్టులు ఫెయిల్!

ప్రత్యేక తమిళ ఈలం(తమిళ దేశం) కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఎల్టీటీఈ 2009 మేలో అంతిమ ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీలంక ఉత్తర, పూర్వ తమిళ ప్రాంతాల్లోని మెజారిటీ భూభాగాన్ని ఏళ్ల తరబడి తన కంట్రోలులో ఉంచుకుని, పాలన చేపట్టి, వాయు, నౌకాబలగాలు సహా 40వేలకు మించిన రెగ్యులర్ సైన్యాన్ని కలిగిన ఎల్టీటీఈ.. స్థావరయుద్ధంలో ఇరుక్కుపోయి చివరకు ఘోర ఓటమిని చవిచూసింది. క్రమక్రమంగా శ్రీలంక సైన్యాలు తమ భూభాగాన్ని చుట్టుముడుతున్నాయని, తమ ఏరియా కుంచించుకుపోతున్నదని తెలిసినా,…

Read More

సోనూ, ఆశన్న చేసిన తప్పులివే.. ఆయుధాలు వదిలేయడం చరిత్రలో కొత్త కాదా?

మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన సోనూ, ఆశన్న తదితరులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియస్ చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా వాళ్లు మూకుమ్మడిగా ఆయుధాలు వదిలేసి, పోలీసుల ఎదుట లొంగిపోవడాన్ని నెటిజన్లు, మేధావుల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే వారిని ద్రోహులుగానే అభివర్ణిస్తున్నారు. ఇలాంటి మేధావులపై ఇటీవల సోనూ, ఆశన్న తదితరులు తీవ్రంగా విరుచుకు పడుతూ మాజీ మావోయిస్టుల పేరుతో పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో చరిత్రకు, రాజకీయాలకు సంబంధించిన కొన్ని వివరాలు…

Read More

నక్సలైట్ నేతగా నేషనల్ మీడియాతో నా ఇంటర్వ్యూ..

జర్నలిజంలోకి ప్రవేశించక ముందు నేను విప్లవోద్యమంలో పనిచేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణ, కర్నాటక, దండకారణ్య(డీకే) ప్రాంతాల్లో వివిధ రంగాల్లో 17 ఏళ్లు పనిచేసి కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా బయటకు వచ్చాను. జర్నలిజంలో పీజీ చేసి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాను. ప్రస్తుతం దిశ దినపత్రిక ఎడిటర్‌గా ఉన్నాను. 1998లో నేను డీకేలో ఉన్నప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పార్టీ తరఫున నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాను….

Read More

అన్నల రాజ్యం-5: ఇళ్ల దహనాలు ఇక్కడ కామన్..

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్లు ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. కూలీ రేట్లు పెంచాలని, కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు అరికట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు సభలు పెట్టినా, ర్యాలీలు తీసినా, బంద్లు నిర్వహించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. విసిగి వేసారి చివరకు మావోయిస్టుల గైడెన్స్లో స్వయంపాలనకు పూనుకుంటే మాత్రం వెంటనే బలగాలను దించి భయపెట్టే, బలప్రయోగం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు….

Read More

అన్నల రాజ్యం-2: నాలుగు జిల్లాల్లో సమాంతర సర్కార్లు!

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) కటిక చీకట్లలో కడు పేదరికంతో కూడు, గూడు, గుడ్డ కరువైన దీనస్థితిలో బతుకుతున్న బస్తర్ ఆదివాసులకు 1980లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశించిన నక్సలైట్లు దేవుళ్లలా కనిపించారు. అభివృద్ధి పేరుతో అటవీ సంపదను, ఖనిజ వనరులను దోచుకెళుతున్న ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు చేస్తున్నదేమీ లేదని అన్నలు చెప్పిన మాటలను మొదట వాళ్లు నమ్మలేదు. అయితే కాలక్రమంలో పాలకుల పట్టించుకోనితనం, అటవీ సిబ్బంది అరాచకాలు, కాంట్రాక్టర్ల, షావుకార్ల దోపిడి వారిని మావోయిస్టులకు దగ్గర…

Read More

అబూజ్‌మాడ్ గోండులు- జీవితం.. పోరాటం..

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దాడి సన్నాహాలు, మావోయిస్టుల ప్రతిదాడుల నేపథ్యంలో అబూజ్‌మాడ్ కొండలు మరోసారి వార్త ల్లోకెక్కాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బసర్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ కొండలు మావోయిస్టులకు అడ్డాగా మారాయని, ఇక్కడి దట్టమైన అడవుల్లో శిక్షణ పొందుతూ బలగాలను సమీకరించుకుని పరిసర ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు నాయకత్వం కూడా ఇక్కడే ఆశ్రయం పొందుతూ దేశ వ్యాప్తంగా కార్యకలాపాలను సమన్వయిస్తోందని వారు చెబుతున్నారు. ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పిఎల్‌జీఏ)…

Read More