క్యాన్సర్‌తో మహిళా మావోయిస్టు పద్మ అలియాస్ రాజేశ్వరి మృతి..

సుదీర్ఘకాలం మావోయిస్టు రాజకీయాల్లో పనిచేసిన కనకరాజు పద్మావతి అలియాస్ పద్మ, జూరీ, రాజేశ్వరి క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న రాత్రి బెంగళూరులో కన్నుమూశారు. జననాట్యమండలి నేత దివాకర్‌కు సొంత చెల్లెలయిన పద్మ 1990లలోనే అప్పటి పీపుల్స్ వార్‌ పార్టీలో చేరి 2001 వరకూ పనిచేసింది. ఆ తర్వాతి కాలంలో మావోయిస్టు పార్టీ నుంచి చీలిపోయిన కర్ణాటక విప్లవకారులతో చేరి చివరి వరకూ అందులోనే పనిచేసింది. ఝరి అనే పేరుతో పలు రచనలు సైతం చేసింది. పద్మ అంత్యక్రియలు…

Read More

బీ టీంలే బీజేపీని గెలిపిస్తున్నాయా?

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) నేత అతిషీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాల్లోనూ బరిలో దిగుతామని, మార్చ్ మొదటివారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అమలుచేస్తున్న పథకాలను కర్ణాటకలో కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. పార్టీ కర్ణాటక అధ్యక్షుడు పృథ్వీరెడ్డి కూడా ఇదే విషయాన్ని అనేక సభల్లో ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్)ల పట్ల…

Read More