2023: కౌన్ బనేగా సీఎం!?

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఏడాదిన్నర కాలమున్నా అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించి ఇప్పటికే తమ భవిష్యత్ బాటను స్పష్టపరచారు. వడ్ల కొనుగోలుపై ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒంటరి చేయ యత్నించారు. మోడీ పట్టించుకోకున్నా తాను పట్టించుకుంటానని రైతులకు సందేశం అందేలా వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఇటీవల పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై ఆధారపడి…

Read More

హుజూరాబాద్‌లో నోటుకు ఓటు విప్లవం!

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎవరు గెలుస్తారో ఎల్లుండికల్లా తేలిపోనుంది. ఈటల రాజేందర్ గెలుస్తారా లేక టీఆర్ఎస్ క్యాండిడేట్ గెల్లు శ్రీనివాస్ గెలుస్తారా? ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం కాని నోటుదే విజయమన్న విషయం మాత్రం రుజువైపోయింది. ఈ ఇద్దరు అభ్యర్థులూ విచ్ఛలవిడిగా ఓట్ల కోసం నోట్లు పంపిణీ చేశారు. అధికార పార్టీ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టివుండవచ్చు గాక, బీజేపీ సైతం వెనకపడలేదు. ఉన్నంతలో డబ్బులు పంచింది. ఆ…

Read More

హుజూరాబాద్‌లో చివరకు నోటుదే విజయమా?

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రధాన పార్టీలు తమ యుద్ధ మోహరింపులను పూర్తి చేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో దిగగా, అధికార పార్టీ తరఫున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. మరో 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా అందరి దృష్టీ రెండు పార్టీల పైనే ఉంది. కాంగ్రెస్ బరిలో ఉన్నా…

Read More

అక్కడ పగలు టీఆర్ఎస్.. రాత్రి బీజేపీ!

హుజారాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ కాకుండా 15మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దసంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుండగా, ఉపసంహరణకు గడువు ఈ నెల 13 వరకూ ఉంది. చివరకు బరిలో ఎంతమంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యనే…

Read More

హుజూరాబాద్ ఓటెవరికి!?

రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వరకు నామినేషన్లకు గడువు ఉండగా, 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఫలితంగా జరుగుతున్న ఈ ఉపఎన్నిక అటు సీఎం కేసీఆర్‌కు, ఇటు బీజేపీలో చేరిన ఈటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పక్కా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్, ఆయన తనంతట…

Read More

కేసీఆర్ మదిలో మధ్యంతర ఎన్నికలు?

రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. లెక్క ప్రకారం 2023 డిసెంబర్ వరకూ ప్రస్తుత శాసనసభ కాలం ఉన్నా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. దళితులను ఆకట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించడానికే అంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన చేసిన ప్రసంగం వింటే త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. దళితబంధును రాష్ట్రమంతా పకడ్బందీగా అమలుచేస్తామని, దళితవాడల్లో అన్ని…

Read More

హుజూరాబాద్.. మినీ 2023?

ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును కేసీఆర్ రంగంలోకి దించారు. సిద్దిపేట సమీపంలోని రంగనాయక్‌సాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా ‘ఆపరేషన్ హుజూరాబాద్’ కొనసాగుతున్నది. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, వీరవిధేయుడు ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో పల్లెపల్లెనా ఈటల వ్యతిరేక ప్రచారం కొనసాగుతున్నది. ఇప్పటికే మండలానికో మంత్రిని లేదా ఎమ్మెల్యేను, గ్రామానికో నేతను అన్నట్టుగా ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి యాభై లేదా వంద మంది ఓటర్లకు ఒక పోల్ మేనేజ్‌మెంట్ పర్సన్‌ను కేటాయించాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడవద్దని…

Read More

కేటీఆర్ టైం వచ్చేసింది!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పల్లెలు, పట్టణాల నుంచి మొదలుకొని రాజధాని వరకు ఆ పార్టీ శ్రేణులలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ముందు కినుక వహించిన నేతలు కూడా చివరకు ప్రమాణస్వీకారానికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణ తల్లి సోనియమ్మేనంటూ రేవంత్ చేసిన ప్రసంగం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఒకరకంగా వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సైరన్ ఊదిన సంకేతాలు…

Read More

మోడీ వాంట్స్ తెలంగాణ!

తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు…

Read More

కొత్త ప్రాంతీయ పార్టీకి స్పేస్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ మేరకు సంకేతాలివ్వడం ఇందుకు కారణం కావచ్చు. వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నేతలను రహస్యంగానో, బహిరంగంగానో కలువడం కూడా ఈ చర్చకు తోడైంది. అయితే, బీజేపీ అగ్రనేతలు ఈటలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని.. కాదు, రేవంత్‌రెడ్డితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో…

Read More