ఇది ఇండియా.. రూల్స్ వర్తించవు

డిగ్రీ చదివే రోజులలో మా రూమ్మేట్ ఒకడుండేవాడు. ఏదైనా పద్ధతిని పాటించే విషయంలో చర్చ వచ్చినప్పడల్లా ‘ఇది ఇండియా.. ఇక్కడ రూల్స్ గీల్స్ నై చల్తా’అనేవాడు. అదేంటని అడిగితే ‘ఇక్కడ రూల్స్‌ తోపాటే వాటిని బ్రేక్ చేసే మార్గాలు కూడా తయారవుతాయి. అందుకే ఎవరూ పాటించరు’అనేవాడు. అందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు చూపించేవాడు. ఎవరు ఎంత వాదించినా చివరకు ప్రతిసారీ అతనే గెలిచేవాడు. సుమారు ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు కరోనా కాలంలో ఆయన మాటలు ఎంతటి అక్షరసత్యాలోనని…

Read More

జనాభా లెక్కలు- అపోహలు.. నిజాలు

జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నివేదికలో పొందుపర్చారు. నివాసగృహాల సంఖ్యతో పాటు వాటికి సమకూరివున్న సదుపాయాలు, జనాభా పెరుగుదల రేటు, లింగ నిష్పత్తి, అక్షరాస్యత, జననాల-మరణాల రేటు, సగటు జీవితకాలం, ఎస్‌సీ, ఎస్‌టీలు, మతాల వారీగా జనాభా, పట్టణీకరణ తదితర అనేక వివరాలు ఇందులో ఉన్నాయి. నివేదిక ప్రకారం 2011 మార్చ్ 1 నాటికి దేశ జనాభా…

Read More

నేపాల్ సైన్యంలో మావోయిస్టులు

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13వేల ప్రాణాలు బలికావడానికి కారణమైన వైరి పక్షాలు త్వరలో ఒకే సంస్థలో కదం కదం కలిపి దేశరక్షణ విధులను నిర్వర్తించబోతున్నాయి. యునిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎస్ఏ)కి చెందిన తొమ్మిది వేల మందికి పైగా గెరిల్లా సైనికులు ప్రభుత్వ సైన్యంలో భాగమయ్యే ప్రక్రియ ఇటీవల అక్కడ మొదలైంది. ఇందుకోసం…

Read More

పోస్కోపై మూలవాసుల పోరాటం

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్కో వ్యతిరేక పోరాటం ప్రముఖమైనది. రూ. 60 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఏటా 12 మిలియన్ టన్నుల స్టీలును ఉత్పత్తి చేయడం లక్ష్యం గా భారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి పోస్కో కంపెనీ ఒరిస్సా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు స్థానికులు అత్యంత దృఢమైన, రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారు. జగత్సంగ్పూర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలకు చెందిన సుమారు…

Read More