బీ టీంలే బీజేపీని గెలిపిస్తున్నాయా?

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) నేత అతిషీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాల్లోనూ బరిలో దిగుతామని, మార్చ్ మొదటివారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అమలుచేస్తున్న పథకాలను కర్ణాటకలో కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. పార్టీ కర్ణాటక అధ్యక్షుడు పృథ్వీరెడ్డి కూడా ఇదే విషయాన్ని అనేక సభల్లో ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్)ల పట్ల…

Read More

కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యమేనా!?

చూడబోతే, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహం సక్సెస్ అయ్యేట్టే కనిపిస్తోంది. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని వీరిద్దరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్'(Congress mukt Bharat) కోసం బహిరంగంగానే పిలుపునిచ్చారు. వారి కృషి ఫలితమా, అన్నట్లుగా 2014లో మొదటి దఫా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హస్తం పార్టీ క్రమంగా బలహీనమవుతూ వస్తున్నది. ఆ యేడు కోల్పోయిన లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష హోదాను ఐదేళ్ల అనంతరం…

Read More

మోడీకి ప్రత్యామ్నాయం లేదా?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ మంచి దూకుడు మీదుంది. ఇప్పటికే రెండు దఫాలుగా పాలన సాగించిన ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన అనేక విమర్శలున్నా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలినా 2019 మే తర్వాత ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధిస్తూనే వుంది. చేజారుతుందని భావించిన ఉత్తరప్రదేశ్‌ 2022లో అనూహ్యంగా భారీ మెజారిటీతో తమ ఖాతాలో పడడం కమలనాథులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో…

Read More

గెలుపు కోసం కేసీఆర్ త్రిముఖ వ్యూహం..

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్@పీకే టీం సర్వే నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా లేని నియోజకవర్గాలలో నష్టనివారణ చర్యలు చేబడుతున్నారు.40 మంది వరకు…

Read More
Marokonam

చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?

వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలోని పరిమిత స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో జనసేన బలంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటుబ్యాంకు ఏర్పడిందని చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదని, ఇతర పార్టీల గెలుపోటములను మాత్రం ప్రభావితం చేయగలమని స్పష్టం చేశారు.పవన్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పార్టీల ప్రభావంపై మరోమారు చర్చ ఊపందుకుంది. జనసేనతో పాటు…

Read More