పౌరులపై ‘సాయుధ’ చట్టం ?!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ సంచలనం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని మలోం గ్రామ సమీపాన ఓ బస్టాపు వద్ద నిలబడివున్న ప్రయాణికులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన నేపథ్యంలో మరుసటి రోజు షర్మిల తన దీక్షను మొదలుపెట్టింది. ఎవరిని కాల్చుతున్నామో కూడా పట్టించుకోకుండా ప్రజలపై…

Read More

అన్నలరాజ్యం-3: విముక్తి ప్రాంతాలు ఏర్పాటుచేస్తారా?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) ఎమర్జెన్సీ తదనంతరం కేంద్ర ఆర్గనైజర్ల రూపంలో రైతాంగాన్ని, యువతీ యువకులను ప్రజాసంగాల్లోకి సమీకరించిన నక్సలైట్లు ఆ తర్వాత క్రమంగా తమ నిర్మాణాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకున్నారు. భూస్వాముల, గూండాల దాడుల నుంచి రక్షణ కోసం ఒక ఆర్గనైజర్, ఇద్దరు సభ్యుల (1+2) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఆ సభ్యుల వద్ద తపంచాలు, నాటుబాంబులు ఉండేవి. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలపై సైతం దాడి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 1985 నుంచి ఐదుగురి…

Read More

మేం మారం.. మీరు మారండి

‘ఈ మధ్యనే ఇంటర్నేషనల్ మీడియాలో ఓ వార్త వచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటించలేదని నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్‌బెర్గ్‌కు ఆ దేశ పోలీస్ చీఫ్ 2352 డాలర్ల (సుమారు లక్షా 76 వేల రూపాయలు) ఫైన్ విధించారని ఆ వార్త సారాంశం. ఆమె ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు విందులో హాజరైనవాళ్లు మాస్క్ ధరించలేదని, సోషల్ డిస్టెన్స్ పాటించలేదని ఈ చర్య తీసుకున్నారు. పోలీస్ చీఫ్ చర్యను వ్యతిరేకించకుండా ఆ జరిమానా చెల్లించడమే కాకుండా సోల్‌బెర్గ్‌ దేశ ప్రజలకు…

Read More

‘అంతరంగ’ మథనం – అన్నవరం దేవేందర్ పుస్తక సమీక్ష

సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా, నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి. ఒక ఆర్టికల్‌కి మరొక ఆర్టికల్‌కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండును ఒలిచి పెట్టినట్లుగా పాఠకులకు చెప్పడం అన్నకు కొట్టిన పిండి. తెలంగాణ మట్టి వాసన మరువని, మూలాలను వదులుకోని, పదవులకు అమ్ముడుపోని హృదయాంతరంగాన్ని స్వచ్ఛంగా తనలో నిలుపుకున్నారు కాబట్టే స్వేచ్ఛగా, నిర్భీతిగా, సహజాతి సహజంగా…

Read More

కమ్యూనిస్టులు కనుమరుగేనా!

తెలంగాణ అంటేనే బయటి ప్రపంచానికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు గుర్తొస్తారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మేం తెలంగాణ నుంచి వచ్చామని చెప్తే, కాస్త అనుమానపు చూపులు చూడడం చాలా మందికి అనుభవమే. మనది పోరాటగడ్డ అని, జనాలలో తిరుగుబాటు మనస్తత్వం ఉంటుందని భావించడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 1946-51 మధ్య ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేతృత్వంలో కొనసాగిన రైతాంగ సాయుధపోరాటం చరిత్ర పుటలలో నిలిచిపోయింది. వేలాది రైతాంగ గెరిల్లాలు ఆయుధాలు చేబూని 41 వేల చ.కి.మీ….

Read More

కేసీఆర్.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!

ఫిబ్రవరి 1న చట్టసభల్లో మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఉద్యమకాలం నుంచీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, వాటిల్లో వాడి వేడి బుల్లెట్లు పేల్చడం, జనాలను మెస్మరైజ్ చేయడం, మీడియా పతాక శీర్షికల్లో నిలవడం కేసీఆర్‌కు అలవాటే అయినప్పటికీ, మొన్నటి పత్రికా సమావేశం మరింత స్పెషల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో కేసీఆర్.. మోడీని, ఆయన నేతృత్వంలో నడుస్తున్న సర్కారును, బీజేపీని, ఆ పార్టీ…

Read More

సరళ తరం ఇప్పుడేది!?

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడంతా ‘విరాటపర్వం’ సినిమా పైనే చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని సరళ నిజజీవిత కథపై తీసిన ఈ మూవీ మొన్నటి శుక్రవారం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విప్లవ సానుభూతిపరులతో పాటు ఆలోచనాపరుల, నేటి తరం యువతీ యువకుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. వేణు ఊడుగుల దర్శకత్వ ప్రతిభకు, కథ పట్ల కమిట్మెంటుకు పట్టం కడుతూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రివ్యూలు వస్తున్నాయి. 1992లో ఇంటర్ చదువుతూ విప్లవ రాజకీయాలపైన, విప్లవకారులపైన…

Read More

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంలో రూ. 2.35 ఖర్చు పెట్టగలిగితే చాలు.. వాళ్లు పేదలు కాదం టూ ఇటీవల ప్రణాళిక సంఘం ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. గత ఐదేళ్లలో దేశంలో పేదరికం 37.2 నుంచి 29.9 శాతానికి తగ్గిందని, 2004-05లో 40 కోట్ల 72 లక్షల సంఖ్యలో ఉన్న పేదలు 2010 మార్చి 1 నాటికి…

Read More

లౌకికవాదులు కేసీఆర్ వెనకే చేరాలా?

మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర స్థాయిలో సైతం ఆ పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (అప్పటికి) చాడ వెంకట్‌రెడ్డి ఆగస్టు 20న ప్రకటించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా టీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ…

Read More

దృష్టి మళ్లింపు వ్యూహంలో భాగమే బీఆర్ఎస్!

కేసీఆర్ కొత్త పార్టీపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. దేశ్ కీ నేతా కేసీఆర్.. అంటూ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే, ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆయన పార్టీ చేసేదేముండదని కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు విమర్శించాయి. ఇప్పటికే అధికార పార్టీ వెనక చేరిన సీపీఐ, సీపీఎం మాత్రమే  స్వాగతించాయి. కాగా, ఢిల్లీ స్థాయిలో కొత్త పార్టీ ప్రకటనపై స్పందన కరువైంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను ఎవరూ పెద్దగా పట్టించుకోనేలేదు. ప్రత్యేక రాష్ట్ర…

Read More